
అహ్మాదాబాద్ టీ20: ఓటమి అంచున టీమిండియా
క్రీజులో నిలబడటానికే ఇబ్బంది పడ్డ భారత బ్యాట్స్ మెన్
సూపర్ ఎయిట్ పోరులో భాగంగా దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. పది ఓవర్లలో కేవలం 51 పరుగులే చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది.
ప్రోటీస్ జట్టుకు ఆదిలోనే బూమ్రా షాక్ ఇచ్చాడు. ఫామ్ లో ఉన్న డికాక్ ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ సాధించాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ కూడా పెవిలియన్ చేరాడు. తరువాత ఓవర్లో మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రికిల్ టన్ కూడా బూమ్రా పెవిలియన్ పంపాడు. దీనితో దక్షిణాఫ్రికా 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 20/3 తో నిలిచింది.
అయితే క్రీజులో కుదురుకున్న బ్రెవిస్(45) కు తోడుగా మిల్లర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరు ఎడాపెడా బౌండరీలు బాది ఐదో వికెట్ కు ఏకంగా 97 పరుగులు జోడించి సౌతాఫ్రికాను సురక్షిత స్థానానికి చేర్చారు. ముఖ్యంగా మిల్లర్(63) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్లు ఎవరనేది చూడకుండా బౌండరీలు సాధించాడు. బ్రెవిస్ కూడా భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జంటను దూబె విడదీశాడు. తరువాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్(44) కూడా భారీ షాట్లు ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది.

