టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం స్పెషల్ ట్రైన్
x

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం స్పెషల్ ట్రైన్

న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు


Click the Play button to hear this message in audio format

టి20 ప్రపంచ కప్ ఫైనల్‌ను వీక్షించాలనుకునే క్రికెట్ అభిమానుల కోసం న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ రైలు శనివారం రాత్రి 11.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతుంది.

"విమాన టిక్కెట్ల ధరలు పెరగడం, అహ్మదాబాద్‌కు వెళ్లడానికి ఇష్టపడే ప్రయాణికుల సంఖ్య పెరగడం, రైలు టిక్కెట్లు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాలతో క్రికెట్ అభిమానుల సౌలభ్యం కోసం న్యూఢిల్లీ నుంచి ఈ ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించుకున్నాం," అని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ తెలిపారు.

"ACII, ACIII తరగతులతో కూడిన 19 కోచ్‌ల ప్రత్యేక రైలు శనివారం రాత్రి 11.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ కాంట్, గురుగ్రామ్, జైపూర్ మీదుగా సబర్మతి చేరుకుంటుంది" అని పేర్కొన్నారు.

IRCTC వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌లో బుకింగ్ చేసుకోవడానికి రైలు నంబర్ 04062 అందుబాటులో ఉందన్నారు.

Read More
Next Story