టీ20 వరల్డ్ కప్: భారత్ తో మేము ఆడబోము: పాక్ ప్రధాని ప్రకటన
x
షహబాజ్ షరీఫ్

టీ20 వరల్డ్ కప్: భారత్ తో మేము ఆడబోము: పాక్ ప్రధాని ప్రకటన

బంగ్లాదేశ్ కు మా మద్దతు కొనసాగుతుందని ధృవీకరణ


భారత్‌తో జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీప్ విస్పష్టమైన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ కు తమ మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు.

‘‘భద్రతా సమస్యల కారణంగా భారత్ లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టు స్థానంలో ప్రస్తుతం స్కాట్లాండ్ ఆడుతోంది. భారత్ తో పాటు ఒకే గ్రూపు లో ఉన్న పాకిస్తాన్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న గ్రూప్ మ్యాచ్ లో భారత్ తో ఆడాల్సి ఉంది. అయితే ఈ గేమ్ ను బహిష్కరిస్తున్నట్లు తాజాగా షరీఫ్ ప్రకటించారు.
"మేము చాలా ఆలోచించి ఈ వైఖరి తీసుకున్నాము. మేము పూర్తిగా బంగ్లాదేశ్‌కు మద్దతు ఇవ్వాలి. ఇది చాలా సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. మేము బంగ్లాదేశ్‌తో ఉన్నాము" అని ఆయన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు.
స్పాన్సర్లు, ప్రసారకులు, ప్రకటనదారులకు పెద్ద ఈవెంట్‌లో డబ్బును ఆకర్షించే హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు హాజరు కాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును హెచ్చరించింది. "తమ సొంత దేశంలో క్రికెట్‌కు ఉన్న ముఖ్యమైన, దీర్ఘకాలిక ప్రభావాలను PCB పరిగణనలోకి తీసుకుంటుందని ప్రపంచ క్రికెట్ సంస్థ భావిస్తోంది.
ఎందుకంటే ఇది ప్రపంచ క్రికెట్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దానిలో పాక్ కూడా సభ్యుడు, లబ్ధిదారుడు" శనివారం (ఫిబ్రవరి 7) నెదర్లాండ్స్‌తో జరిగే ఆటతో ప్రారంభమయ్యే దాని వామప్ మ్యాచ్ ల పాక్ జట్టు ఇప్పటికే లంక చేరుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి దాని ఆదాయ వనరులలో దాదాపు 70 శాతం సమకూరుతుంది. అయినా వాటిని ఫణంగా పెట్టి మరి పాకిస్తాన్ ఈ దుస్సాహానికి దిగింది.
బీసీసీఐ సూచనల మేరకు బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ కేకేఆర్ జట్టు నుంచి తప్పించింది. ఈ కారణంతో బంగ్లాదేశ్ భారత్ కు రావడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా పాక్ కూడా భారత్ తో మ్యాచ్ లు ఆడేది లేదని ప్రకటించింది.
Read More
Next Story