కెసిఆర్ కుటుంబ అవినీతిపై త్వరలో శ్వేతపత్రం
x
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

కెసిఆర్ కుటుంబ అవినీతిపై త్వరలో శ్వేతపత్రం

గత పదేళ్లో అనేక ప్రాజక్టులలో, పథకాలలో జరిగిన అవినీతిని ప్రజలముందుకు తెచ్చే ప్రయత్నం.


రాష్ట్రంలో గత పదేళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ దోపిడిని ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఒక శ్వేత పత్రం తీసుకురావాలని తాము ముఖ్యమంత్రి

సీఎంరేవంత్ రెడ్డికి సూచించడం జరిగిందని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు.

నేడు తిరుమలో ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్వేత పత్రం విడుదల చేసే విషయం గురించి వెల్లడించారు.

తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయిందని, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెబుతూ.. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాంమని, మిషన్ భగీరథ పెయిల్ అయిందని, ఎక్కడా మంచి నీరు రావడం లేదన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాజక్టులలో పథకాలలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని ఆయన చెప్పారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగిందన ఆయన స్పష్టంగా చెప్పారు. అదే విధంగా కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం జరగలేదని వివేక్ చెప్పారు. పది సంవత్సరాలలో ప్రజా ధనం దుర్వినియోగంపై వైట్ పేపర్ తీసుకురావాల్సి ఉందని చెబుతూ అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారని వివేక చెప్పారు. ఇదే విధంగా ధరణి పోర్టల్ తో కల్వకుంట్ల కుటుంబం పెద్ద ఎత్తున భూ దందాకు పాల్పడిందని వివేక్ ఆరోపించారు.

Read More
Next Story