ప్రమాణోత్సవానికి  సోనియాను ఆహ్వానించిన రేవంత్
x
ఢిల్లీలో సోనియాగాంధీని కలసిని రాహుల్ గాంధీ

ప్రమాణోత్సవానికి సోనియాను ఆహ్వానించిన రేవంత్

ఈ రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ....


తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి పార్టీ మాజీ అధ్యక్షులు నాయకురాలు సోనియా గాంధీని కలిశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా తన పేరును ఖరారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ అభ్యర్థన మేరకు గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఆమెతో పాటు రాహుల్ గాంధీ ని ప్రత్యేకంగా రేవంత్ కలిశారు.



వారిద్దరితో పాటు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. తదితరులు రానున్నారు.

రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీష్ గడ్ లలో పార్టీ దారుణ పరాభవం పాలయినా, తెలంగాణలో గెలవడంతో కాంగ్రెస్ అధిష్టానం హుశారుగా ఉంది. తెలంగాణ నుంచే పార్టీ జాతీయ పునరాగమనం మొదలువుతందని సోనియా, రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందువల్ల రేవంత్ క్యాబినెట్ పదవీ స్వీకార కార్యక్రమానికి వారు తప్పకుండా హాజరవుతారని పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

Read More
Next Story