ఫామ్ హౌస్ లో కొలువు దీరిన కెసిఆర్
x
సామ్ హౌస్ ఎమ్మెల్యేలను కలుసుకున్న కెసిఆర్

ఫామ్ హౌస్ లో కొలువు దీరిన కెసిఆర్

ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ శాసన సభ్యులతో సమావేశమయ్యారు.


బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక శాసన సభ్యులతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఫామ్ హౌస్ శాసన సభా పక్ష సమావేశాలు జరగవు. అయితే, ఈ సారి అధికార నివాసం ‘ప్రగతి భవన్ ’ ని ఖాళీ చేయడంతో ఆయన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. దీనితో కొత్తగా ఎన్నికయిన శాసన సభ్యులంతా ఆయనను కలుసుకునేందుకు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.

అక్కడ, కొత్త శాసన సభ్యులంతా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

వారితో పాటు పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇతర నేతలు కేసీఆర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు.

Read More
Next Story