రేవంత్‌ను కలిసిన చిరంజీవి
x

రేవంత్‌ను కలిసిన చిరంజీవి

తెలంగాణకు తాను, తన కుమారుడు రాంచరణ్ విడివిడిగా ప్రకటించిన ఆర్థిక సహాయం రు.50 లక్షలను చెక్కుల రూపంలో రేవంత్‌కు చిరంజీవి అందజేశారు.


మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు. ఇటీవల వరదబాధితుల సహాయార్థం తాను, తన కుమారుడు రాంచరణ్ విడివిడిగా ప్రకటించిన ఆర్థిక సహాయం రు.50 లక్షలను చెక్కుల రూపంలో రేవంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురూ కాసేపు ముచ్చటించుకున్నారు. మంత్రి సీతక్క కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తర్వాత రేవంత్ చిరును శాలువాతో సత్కరించారు.

మరోవైపు అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కూడా ఇవాళ ఉదయం రేవంత్‌ను కలిసి తాము ప్రకటించిన కోటి రూపాయల విరాళం చెక్కును అందజేశారు. ఇవాళ ముఖ్యమంత్రికి విరాళాలు అందజేసినవారిలో నటులు సాయి ధరమ్ తేజ్, ఆలీ, విష్వక్ సేన్ కూడా ఉన్నారు.

Read More
Next Story