తొలిసంతకం.. వాటిపైనే చేసిన సీఎం రేవంత్ రెడ్డి
x
సీఎం రేవంత్ రెడ్డి

తొలిసంతకం.. వాటిపైనే చేసిన సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి తన తొలిసంతకాన్ని ఎన్నికలప్రచారం లో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీల అమలుపై పెట్టారు. అలాగే తను మాట ఇచ్చినట్లుగా కుమ్మరి రజని అనే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు. అంతకుముందు అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం చేశారు. దీనికి కాంగ్రెస్ అతిరథ మహరథులు తరలివచ్చారు. గవర్నర్ తమిళి సై రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెల్నీ బద్దలుకొట్టినట్లు ప్రకటించారు. తెలంగాణకు పదేళ్ల కింద పట్టిన చీడ పోయిందని, రేపు ఉదయం మహత్మా జ్యోతిబా ఫూలే ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ అంతటా సమాన ప్రగతి సాధిస్తామని హమీ ఇచ్చారు.

Read More
Next Story