కాంగ్రెస్కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికీ లేదు: మహేష్ కుమార్ గౌడ్
అంబర్పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన బీసీ బంద్ ర్యాలీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చిత్తశుద్ధి మరే ఇతర పార్టీకి లేదన్నారు. ‘‘కుల సర్వే చేశాం. జీఓ ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్ అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తాం. ప్రభుత్వ పరంగా 42శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు.
Update: 2025-10-18 07:11 GMT