ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం: ఒవైసీ
AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉగ్రదాడిని ఖండించారు. ‘‘మతాన్ని తెలుసుకుని ఉగ్రవాదులు అమాయకులు చంపడం నిజంగా ఇది బాధాకర ఘటన. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలకు ఆదుకోవాలి. ఉగ్రవాదుల్ని తగిన గుణపాఠం చెప్పాలి.’’ అని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఒవైసీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Update: 2025-04-23 07:18 GMT