ముగ్గురు అనుమానితుల ఊహా చిత్రాల విడుదల...

పహల్గాం వద్ద మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరికొంతమంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా ముగ్గురు అనుమానితుల ఊహా చిత్రాలను సోలీసులు విడుదల చేశారు. ఉగ్రదాడిలో అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ముగ్గురూ గతంలో పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) మంగళవారం మధ్యాహ్నం ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

Update: 2025-04-23 08:53 GMT

Linked news