అమిత్ షా రాజీనామా చేయాలి: టీఎంసీ
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రంపై టీఎంసీ తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాల కోల్పోడానికి భద్రతా వైఫల్యమే కారణమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ ఆరోపించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేవారు.
"జమ్మూ కశ్మీర్లో అన్నీ బాగానే ఉన్నాయి' అన్న వాదనలు కట్టిపెట్టండి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ" టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఎక్స్ వేదికగా స్పందించారు.
"పుల్వామా ఘటన తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్కి సమాచారం ఉన్నా, ఎందుకు ఆపలేకపోయారు?," అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రాత్యా బసు పోస్ట్ చేశారు.
Update: 2025-04-23 13:11 GMT