ముగ్గురు హీరోల ... భైరవం మూవీ రివ్యూ

సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;

Update: 2025-05-30 11:45 GMT

చాలాకాలంగా వెండితెర మీద కనిపించని ముగ్గురు హీరోలు ఒక్కసారిగా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ — ఒక్కో దశలో మంచి హిట్లను అందించిన ఈ ముగ్గురు గత కొంతకాలంగా వెనకబడ్డారు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో, ఒకే కథలో… ఒకే యుద్ధానికి సిద్ధమయ్యారు. అదే "భైరవం"! ఈ సినిమా ఈ ముగ్గురు హీరోల కెరీర్ లకు పరీక్ష లాంటిదీ చిత్రం ..మరి ఈ పరీక్షలో వారు నెగ్గారా, సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఈ కథ రెండు కుటుంబాల మ‌ధ్య త‌రాల స్నేహం, ఆల‌య భూముల నేప‌థ్యం ప్ర‌ధానంగా సాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా దేవిపురం అనే గ్రామం. ఆ ఊళ్లో వారాహి అమ్మ‌వారి ఆల‌యం. ఆ దేవాలయానికి రూ.వెయ్యి కోట్లు విలువ చేసే భూములు. వాటిపై మంత్రి వెదురుమల్లి (శ‌ర‌త్ లోహితాశ్వ‌) క‌న్నేస్తాడు. అయితే ఆ కన్నుకు అడ్డంగా గ‌జ‌ప‌తి వ‌ర్మ (మంచు మ‌నోజ్‌), వ‌ర‌ద (నారా రోహిత్‌) ఉంటారు. ఆ ఇద్దరూ ఆల‌య భూముల‌కు, న‌గ‌ల‌కూ ర‌క్ష‌ణ క‌వ‌చంలా కాపలా కాస్తూంటారు. ఇక ఆ ఇద్ద‌రికీ వీర విధేయుడు శ్రీను (బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌). ఈ ముగ్గుర్ని దాటితే కాని కోట్ల రూపాయల సొమ్ము తనకు రాదు.

ఈ లోగా వారాహి అమ్మవారి ఆలయ ట్రస్టీ నాగరత్నమ్మ (జయసుధ) మరణించడంతో… ఆలయ ధర్మకర్తగా అనుకోకుండా శీను బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఈ ఆస్దిని కొట్టేయటానికి అందుకోసం మంత్రి ఓ ఎత్తు వేస్తాడు. ఆ ముగ్గురు మధ్య చిచ్చు పెట్టి తన పని తాను చేసుకోవాలనుకంటాడు. అంతే మంత్రి కుట్రలు మొదలవుతాయి. స్నేహం తడబడుతుంది. అసలు ఆట మొదలవుతుంది. అనుమానాలు, విచ్చలవిడిగా ఆవేశాలు – మలుపులుగా వచ్చేస్తాయి. చివరకు ఏమైంది..ఆ ఆస్ది భూములు మేటర్ ఏమైంది, ఈ స్నేహితులు విడిపోతారా, కలిసి ఉంటారా, శ్రీను ఆ గుడి ఆస్దిని మంత్రి నుంచి రక్షించగలుగుతాడా అనేది తెర మీద చూడాల్సిన కథ.

ఎలా ఉంది.

తమిళ ఇండస్ట్రీని ఊపేసిన "గరుడన్" ‌కి ఇది అఫీషియల్ తెలుగు రీమేక్. కానీ ఇది కేవలం అనువాద సినిమా కాదు… టాలీవుడ్ జనాల టేస్ట్‌కు తగ్గట్టుగా డిజైన్ చేద్దామని ప్రయత్నించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్. దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన ప్రయత్నం,కష్టం నిజంగా గొప్పవే. ముగ్గురు హీరోలను ఒకే స్క్రీన్‌లో బ్యాలెన్స్ చేస్తూ ప్లేస్ చేయడం చిన్న విషయం కాదు. అయితే ఈ సందట్లో ... కథలో సోల్ – ఎమోషన్ – మాత్రం ఆయన అరచేతిలో నుంచి జారిపోవటం గమనించుకోలేదు.

ముగ్గురు హీరోల్ని శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల్లో చూపిస్తూ, క‌థ‌లోని డ్రామాతో క్రియేట్ చేసారు, కానీ ఎమోషన్ రైజ్ చేయలేకపోయారు. అలాగే విలన్ స్ట్రాంగ్ గా లేవు, ఓ రకంగా ఎవరు విలన్, ఎవరితో హీరో పోరాడలనేది తేలేటప్పటికే ప్రీ క్లైమాక్స్ వచ్చేస్తుంది. ఇక్కడే ఇంట్రస్ట్ పట్టుజారిపోయేది.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ...

భైరవం మూడు పాత్రలతో కూడిన multi-protagonist కథ. ముగ్గురు హీరోల‌కి త‌గ్గట్టుగా యాక్ష‌న్‌... క‌మర్షియ‌ల్ హంగుల్లో భాగంగా జోడించిన పాట‌లు.. బోలెడ‌న్ని పాత్ర‌లు... ఇలా అన్నీ తెర‌పైన ఘ‌నంగానే క‌నిపిస్తాయి. వ‌రుస‌గా హీరోల ప‌రిచ‌య స‌న్నివేశాల‌తో సినిమాని ఆరంభించిన ద‌ర్శ‌కుడు... ప్రేక్ష‌కుడిని అస‌లు క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి కాస్త ఎక్కువ స‌మ‌యమే తీసుకున్నాడు.

ఇటువంటి కథలకు కచ్చితమైన "interwoven structure" అవసరం. అంటే ప్రతీ పాత్రకి తనకు చెందే Inciting Incident ఉండాలి వాటి ఫలితంగా మిగిలిన పాత్రలపై Cause & Effect ఏర్పడాలి చివరికి ముగింపు దగ్గర ఈ మూడు ఆర్క్స్ ఒకే "Emotional Payoff" దగ్గర కలుసుకోవాలి.

ఇక్కడ జరిగిందేమిటంటే – మూడు పాత్రల arcs స్ట్రక్చర్లో మెకానికల్ గా కూర్చబడ్డాయి కానీ, ఆర్గానిక్ గా ఇంటర్ వీవ్ కాలేదు.

అందుకే మొదటి భాగంలో మూడు పాత్రలు మూడు మార్గాల్లో నడుస్తూ – వేర్వేరుగా కనబడతాయి. వీరి మధ్య emotional causality కనిపించదు. ఇక క్లైమాక్స్ ఫిజికల్‌గా grand గా కనిపించినా – emotional resolution లోపిస్తుంది.

దైవికత ఉన్న కథ… కానీ మానవతా లోతుల్లేని స్క్రీన్‌ప్లే! తో ఈ సినిమా తయారైంది.

ఒరిజనల్ స్దాయిలో లేదా

‘గరుడన్’ అనే ఒరిజినల్‌ చిత్రంలో ఎమోషన్ ఓ స్దాయిలో నిశ్శబ్ద శబ్దంలా సీన్స్ మథ్య వుంటుంది. ప్రేక్షకులు మనసులో పెరిగే ఆ మౌనాన్ని తెరపై తీసుకొచ్చిన తీరు అద్భుతం అంటూ తమిళం వాళ్లు భుజాన పెట్టుకున్నారు. కానీ ‘భైరవం’లో ఆ స్థితి కనిపించదు. ఒరిజినల్ ఎమోషనల్ లేయర్స్‌ను వదిలేసి, మాస్ యాక్షన్ ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వలన, కథలో హైలెట్ గా నిలవాల్సిన లేయర్స్ మాయమయ్యాయి.

టెక్నికల్ గా..

శ్రీచరణ్ పాకల (Sricharan Pakala) పాటల విషయంలో పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తానేంటో చూపెట్టాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ఎలివేషన్స్ కి బాగ్ ప్లస్ అయ్యాడు.

మరో ప్రక్క సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ సినిమాకి ప్లస్ పాయింట్ గానే నిలిచాయి. అయితే ఎడిటింగ్ లో ఇబ్బంది, ముఖ్యంగా జంప్ కట్స్ మరీ ఎక్కువయ్యాయి. అందువల్ల స్మూత్ ఫ్లో గా వెళ్లినట్లు అనిపించదు.

నటీనటుల్లో ..

విశ్వాసం, విధేయ‌త క‌లిగిన కుర్రాడిగా సాయి శ్రీనివాస్ బాగా చేసారు. ఫైట్స్ లో ఓకే అనిపించుకున్నాడు. అదితీ శంక‌ర్‌తో సాగే లవ్ స్టోరీ తేలిపోయింది. ఊరి పెద్దగా వ‌ర‌ద పాత్ర‌లో నారా రోహిత్, మరో పవర్ ఫుల్ పాత్రలో మంచు మ‌నోజ్ రీ ఎంట్రీకి త‌గ్గ పాత్రలే చేసారు. మంచు మనోజ్ కొన్ని చోట్ల లౌడ్ గా కనిపించారు. వెన్నెల కిశోర్ వలన పెద్దగా ఉపయోగం లేదు. అజ‌య్, శ‌ర‌త్ లోహితాశ్వ‌, సంప‌త్ రాజ్‌, రాజా ర‌వీంద్ర రొటీన్ క్యారక్టర్స్ లో కనిపించారు.

ఫైనల్ థాట్..

ఎక్కువ ఎలివేషన్‌లు… తక్కువ ఇంటెన్సిటీ ఉన్న సినిమా ఇది. అవమానంలోంచి పుట్టిన తిరుగుబాటుని, బలహీనతలోంచి పుట్టిన ధైర్యాన్ని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఫెరఫెక్ట్ మాస్ మసాలా సినిమా అయ్యేది. ఏదైమైనా మాస్ ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉండటం వలన ఆ వర్గానికి నచ్చే అవకాసం ఉంది.

Tags:    

Similar News