బంగ్లాదేశ్ రాజకీయాల్లో చీరెల వేట

బంగ్లాదేశ్ లో ప్రతిపక్షాలు ప్రారంభించిన ఇండియా అవుట్ ప్రచారంపై ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ముందు మీ ఇళ్లలో మీ భార్యలు కొన్న భారతీయ చీరలను తగలబెట్టాలని..

Update: 2024-04-02 06:25 GMT
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో అక్కడి ప్రతిపక్షం ప్రారంభించిన ‘ఇండియా అవుట్’   క్యాంపెయిన మహిళలు ధరించే చీరెల మీదకు మళ్లింది. 


భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులను బహిష్కరించాలని ప్రతిపక్ష బంగ్లా నేషనల్ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ పిలుపు మీద ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఈ ప్రచారం చేస్తున్న బీఎన్పీ నాయకుల భార్యలకు భారత్ నుంచి ఎన్ని చీరాలున్నాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వాటికి బయటకు తీసుకొచ్చి నిప్పు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికార అవామీ లీగ్ సమావేశంలో హసీనా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

“నా ప్రశ్న ఏమిటంటే, వారి భార్యల వద్ద ఎన్ని భారతీయ చీరలు ఉన్నాయి? మరి భార్యల నుంచి చీరలు తీసుకుని ఎందుకు నిప్పంటించడం లేదు? దయచేసి BNP నాయకులను అడగండి” అని హసీనా అన్నారు. BNP అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులు వారి భార్యలు భారతదేశ పర్యటనల సమయంలో చీరలను కొనుగోలు చేసి, వాటిని బంగ్లాదేశ్‌లో విక్రయించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రధాని చీరలతో ఆగలేదు. బంగ్లాదేశ్ వంటశాలలలో భారతీయ మసాలా దినుసుల పాత్ర గురించి ఆమె చర్చించారు. "గరం మసాలా, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం - భారతదేశం నుంచి వచ్చే అన్ని సుగంధ ద్రవ్యాలు BNP నాయకుల ఇళ్లలో వాడకూడదు" అని ఆమె డిమాండ్ చేశారు.
ఆమె ఎందుకు అన్నారంటే, ఈ మధ్య ఇండియా చీరెలను సమర్థించే విధంగా బిఎన్ పి సీనియర్ జాయింట్ సెక్రెటరీ ఒకరు ఆసక్తికరమయిన ప్రకటచేయడమే. " మాయింట్లో ఎవరూ భారతీయ చీరెలను కొనరు. కాకపోతే,  ఆ మధ్య నా భార్య భారత్ పర్యటకు వెళ్లినపుడు మేనమామ ఆమెకు ఒక చీరె కానుకగా ఇచ్చారు, అంతే," అన్నాడు. 
అందుకే భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలనే ముందు బిఎన్ పి నేతలు తమ భార్యలు దాచుకున్న భారతీయచీరెలను బజార్లో తగలబెట్టాలని అన్నారు.
హసీనా భారత్ తో సఖ్యత కోరుకుంటున్నారు. బిఎన్ పి మాత్రం బంగ్లా వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకుంటున్నదని అంటూ నిరసనగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
బంగ్లాదేశ్‌లో "ఇండియా అవుట్" ప్రచారాన్ని కొంతమంది కార్యకర్తలు, స్వయంప్రకటిత మేధావులు ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా వరుసగా నాలుగోసారి గెలిచి ప్రధాని పీఠం అధిష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో హసీనాకు భారత్ మద్ధతునిచ్చింది ప్రతిపక్ష బీఎన్పీ ఆరోపించింది. ఈ ఎన్నికలను అక్కడి విపక్షాలు బహిష్కరించాయి.
BNP దాని జాయింట్ సెక్రటరీ-జనరల్ రూహుల్ కబీర్ రిజ్వీ తన కాశ్మీరీ-నిర్మిత శాలువను భారతీయ ఉత్పత్తులకు వ్యతిరేకంగా రోడ్డుపై విసిరి తన నిరసనను ప్రదర్శించాడు. అయితే
రిజ్వీ వంటి కొందరు నాయకులు ఇప్పుడు ప్రచారానికి మద్దతు ఇచ్చినప్పటికీ, బహిష్కరణ అంశంపై తమకు అధికారిక వైఖరి లేదని BNP తెలిపింది. అయితే మరో నేత షేక్ హాసీనా చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. భారతీయ చీరలతో పాటు షేక్ హసీనాను విడిచిపెట్టాలని ప్రజలను కోరారు.
Tags:    

Similar News