‘‘నేనే.. నేనే ఆపాను.. ట్రంప్ మరోసారి టముకు’’

భారత్- పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు;

Update: 2025-05-31 04:27 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్- పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేనేలేదని భారత్ అనేకసార్లు స్పష్టం చేసినప్పటి ట్రంప్ మాత్రం టముకు వేసుకోవడం ఆపట్లేదు.

భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించామనే మాటను ఆయన మరోసారి చెప్పారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకనే వారితో అమెరికా వ్యాపారం చేయబోదని రెండు దేశాలకు చెప్పినట్లు పేర్కొన్నారు.

‘‘భారత్- పాకిస్తాన్ పోరాడకుండా మేమే ఆపాము. అది అణు విపత్తుగా మారే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను.’’ అని ట్రంప్ శుక్రవారం ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగానికి నాయకత్వం వహించి తరువాత ట్రంప్ పరిపాలనతో వైదొలుగుతున్న బిలియనీర్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో ఈ సమావేశం నిర్వహించారు.
గొప్ప నాయకులు ఉన్నారు..
‘‘భారత, పాక్ నాయకులకు, ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు. మేము వాణిజ్యం గురించి మాట్లాడాము.
‘‘ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే, అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉన్న వ్యక్తులతో మేము వ్యాపారం చేయలేము’’ అని చెప్పాము. భారత్, పాకిస్తాన్ నాయకులు చాలా గొప్పవారు. వారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. దాన్ని అంగీకరించారు. దాంతో అన్ని ఆగిపోయాయని ట్రంప్ అన్నారు.
‘‘ఇతరులు కూడా పోరాడకుండా మేము ఆపేస్తున్నాము. ఎందుకంటే చివరి మేము ఎవరికన్నా బాగా పోరాడగలము. మనకు ప్రపంచంలో గొప్ప సైన్యం ఉంది. మనకు ప్రపంచంలోనే గొప్ప నాయకులు ఉన్నారు’’ అని ట్రంప్ అన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది పౌరులను బలిగొన్న భయంకరమైన ఉగ్రవాద దాడి జరిగిన రెండు వారాల తరువాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది.
నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. భారత్, పాక్ లోని 12 వైమానిక స్థావారాలు ధ్వంసం చేసింది.  పాక్ లోని అనేక యుద్ధ విమానాలు కోల్పోయింది. దాంతో పాకిస్తాన్ మే 10 న కాల్పుల విరమణ పాటించాలని భారత్ ను అభ్యర్థించింది.  
భూమి, వాయు సముద్రాలపై జరిగే అన్ని కాల్పులు, సైనిక చర్యలను తక్షణమే ఆపడానికి భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్(డీజీఎంఓ)లు ఒక అవగాహానకు వచ్చారని, న్యూఢిల్లీలో భారత ప్రభుత్వం తెలియజేసింది.
ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని అన్నారు. విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కూడా ఎంపీల సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ పదేపదే ఈ విషయాన్ని టముకు వేసుకుంటున్నారు.
Tags:    

Similar News