వాళ్ల కోసం మాజీ మిలిటెంట్లు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ

జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ ఎన్ సీ, కాంగ్రెస్ కూటమి, బీజేపీ మధ్య ఉండబోతోందని..

Update: 2024-09-05 07:33 GMT

జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీల కోసం మాజీ మిలిటెంట్లు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ బుధవారం ఆరోపించారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు ఇంటి ముఖం చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

"మాజీ మిలిటెంట్లు ఎన్‌సి, పిడిపి అభ్యర్థుల కోసం బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని నాకు సమాచారం ఉంది. జమ్మూకాశ్మీర్ ను తిరిగి తన పాత రోజుల్లోకి తీసుకెళ్లాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. శాంతి, పురోగతిని కోరుకునే కొత్త నాయకత్వానికి మద్దతు ఇవ్వాలనుకునే పార్టీలను ప్రజలు ఓడించాలి" అని మాధవ్ శ్రీనగర్‌లో అన్నారు.
ఆర్టికల్ 370, పాకిస్థాన్
లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఐజాజ్ హుస్సేన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు మాధవ్ వెంట ఉన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలను ఆయన ప్రస్తావించారు, ఇవి ఆర్టికల్ 370 పునరుద్ధరణ, రాష్ట్ర హోదా, కాశ్మీర్ సమస్య పరిష్కారం, పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతాయని హామీ ఇచ్చాయి.
"ఎన్‌సి, పిడిపి ఇతర పార్టీలు మానిఫెస్టోలను తీసుకువచ్చారు, ఇది జె అండ్ కెలను పాత, ఇబ్బందులతో కూడిన రోజులకు తీసుకువెళుతుంది," అని ఆయన అన్నారు, కాశ్మీర్ లోయలో కొత్త పార్టీలు, కొత్త నాయకులు ఆవిర్భవిస్తారని అన్నారు.
బీజేపీ గెలుస్తుంది
జమ్మూ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి బిజెపి ప్రతినిధిగా ఎదుగుతుందని, జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వస్తుందని రామ్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. "మంచి సంఖ్యలో యువకులు ముందుకు వస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వాలి" అని మాధవ్ అన్నారు.
“ఈ రాష్ట్రం రెండు కుటుంబాల పట్టులో ఉంది, ఆ రెండు కుటుంబాలకు ఇంటిదారి చూపించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఆ కుటుంబాల నుంచి విముక్తి చేయాలి’’ అని అబ్దుల్లాలు, ముఫ్తీలను ఉద్దేశించి అన్నారు.
మాధవ్ జమాతే ఇస్లామీకి..
కూటమి విచ్ఛిన్నమైతే బీజేపీ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని మాధవ్ అన్నారు. కానీ "అటువంటి పరిస్థితి ఉంటే, మేము దానిని తరువాత చర్చిస్తాము" అని వ్యాఖ్యానించారు.
నిషేధిత జమాతే ఇస్లామీ మాజీ సభ్యులు ఎన్నికల బరిలోకి దిగడాన్ని ఆయన స్వాగతించారు. చాలా మంది (జమాత్ మాజీ సభ్యులు) ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని గ్రహించారు. అందుకే వారు పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు, పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.
"ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరినీ మేము స్వాగతిస్తున్నాము. అయితే ఎవరూ ఉగ్రవాదులు, మాజీ మిలిటెంట్ల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయకూడదు" అని ఆయన అన్నారు.
చాలా మంది (జమాత్ మాజీ సభ్యులు) ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని గ్రహించారు. అందుకే వారు పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు, పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.
సెప్టెంబరు 6న జమ్మూ ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ తర్వాత ప్రధాని, ఇతర నేతలు కూడా సందర్శిస్తారని ఆయన తెలిపారు.
Tags:    

Similar News