కేంద్ర బడ్జెట్ తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారంలోకి మోదీ ప్రభుత్వం పదకొండు సారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజీజు..

Update: 2024-07-06 11:29 GMT

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగష్టు 12 వరకూ జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజీజు శనివారం వెల్లడించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ను జూలై 23న సభలో ప్రవేశపెడతారని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన ఓ పోస్టు లో ‘‘ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ సిఫారుసుపై జూలై 22, 2024న బడ్జెట్ సెషన్, పార్లమెంట్ ఉభయ సభలను పిలిచే ప్రతిపాదనను ఆమోదించారు. ఇవి ఆగష్టు 12 వరకూ పార్లమెంటరీ వ్యవహారాల అవసరాల మేరకు జరుగుతాయి’’ అని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారం చేపట్టి పదకొండో సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నట్లుగా ఇది అనేక చారిత్రాత్మక దశలలో గుర్తుంచుకోబడింది.
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, ప్రధాన సామాజిక, ఆర్థిక నిర్ణయాలు బడ్జెట్‌లో హైలైట్ అవుతాయని అన్నారు. ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.


Tags:    

Similar News