‘చిరాగ్ పాసవాన్’ కు కమలదళం చెక్ పెట్టబోతుందా?

బీహార్ లో త్వరలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని దక్కించుకోవడానికి కమలదళం రాజకీయ ఎత్తులు ప్రారంభించింది. ఎన్డీఏకు మద్ధతు ఇస్తున్న..

By :  Gyan Verma
Update: 2024-08-27 06:31 GMT

బీహార్ లో బీజేపీ తన రాజకీయ ఎత్తులను తిరిగి ప్రారంభించింది. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి తనవంతు సాయం అందించిన చిరాగ్ పాసవాన్ కు చెక్ పెట్టడమే లక్ష్యమా అన్నట్లు వ్యవహరిస్తోంది. పాసవాన్ బాబాయ్, తనతో రాజకీయ వైరం ఉన్న పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ తో సత్సంబంధాలను నెరుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.

త్వరలో బీహార్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పశుపతి, బీజేపీ రాష్ట్ర చీఫ్ దిలీప్ జైశ్వాల్ ను పాట్నాలో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఇది నిజంగా చిరాగ్ కు చిరాకు తెప్పించే వ్యవహరమే. ఆయనకు ఐదుగురు ఎంపీలు ఉన్నారు.

ఆయన ఎంపీలు భేషరుతుగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ అతని బాబాయ్, రాజకీయ ప్రత్యర్థిని ఎందుకు చేరదీసింది? రాజకీయంగా తిరిగి అతడిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

చిరాగ్ పాసవాన్ ఇటీవల వెలువరిస్తున్న అభిప్రాయాలు బీజేపీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ దాఖలు చేయాలని కోరటం, వక్ఫ్ సవరణ బిల్లును, లాటరల్ ఎంట్రీ లో కూడా రిజర్వేషన్ లు ఉండాలని పై బీజేపీ విధాన నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకించడంతో కమలదళం దీనిపై గుర్రుగా ఉందని ప్రస్తుత పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.
అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లలో ఉపవర్గీకరణను అనుమతించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా LJP (రామ్ విలాస్) అప్పీల్ దాఖలు చేసింది. బీజేపీపై కూడా తీవ్రంగా ఒత్తిడి చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఒక వేళ ఈ విషయంలో పాసవాన్ నిర్ణయాలకు లొంగినట్లు అయితే మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కీలకమైన బిల్లుల విషయంలో మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది. కొన్ని బిల్లులను ఉపసంహరించుకోగా, మరికొన్ని జేపీసీకి వెళ్లాయి.
పబ్లిక్ vs ప్రైవేట్ విమర్శలు
“ గత కొన్ని వారాల రాజకీయ పరిణామాలను మనం వెనక్కి తిరిగి చూస్తే.. కేంద్ర ప్రభుత్వం తన సొంత కూటమి భాగస్వామి ఎల్‌జేపీ (రామ్‌విలాస్) తన నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా ఇబ్బందిగా అనిపించి ఉంటుంది” అని సంజయ్ సరాఫ్, సలహాదారు పశుపతి పరాస్, ఫెడరల్‌కి చెప్పారు.
ఎల్‌జేపీ (రామ్‌విలాస్) నాయకత్వం ఈ సమస్యలపై బహిరంగంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కంటే ఎన్‌డీఏ ఫ్రేమ్‌వర్క్‌లోనే తమ ఆందోళనలను లేవనెత్తితే బాగుండేదని ఆయన అన్నారు.
“కూటమి భాగస్వామ్య పక్షాలపై ఈ విధమైన బహిరంగ విమర్శలు కేవలం ఎన్‌డిఎలో విభేదాలను సృష్టిస్తాయని మేము స్థిరంగా చెబుతున్నాము. మీడియాలో ప్రకటనలు చేయడం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇవ్వకుండా ఎన్‌డిఎ భాగస్వాములందరూ జాగ్రత్తగా ఉండాలి ” అని సరాఫ్ అన్నారు.
స్థాయి పెరుగుతుందా?
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, చిరాగ్ పార్టీకి బీహార్‌లో ఐదు సీట్లు ఇవ్వాలని, పరాస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని BJP నాయకత్వం నిర్ణయించడంతో పరాస్ కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేశారు.
ఇప్పుడు, బీహార్‌లో ఉపఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లో కనీసం ఒకదానిలోనైనా పోటీ చేయాలని పరాస్ ఆలోచన. ఈ డీల్ కుదుర్చుకోవడానికి బిజెపి నాయకత్వం దగ్గరకు చేరదీసినట్లు కనిపిస్తోంది. పరాస్ ను ఒప్పించి మొత్తం నాలుగు సీట్లను బీజేపీకి కేటాయించుకుని, ఆయనతో ప్రచారం చేయించుకోవాలని, తరవాత పరాస్ గవర్నర్ పదవి పొందవచ్చు.
“ పశుపతి కుమార్ పరాస్ ఎన్‌డిఎలోనే కొనసాగాలని, వచ్చే ఏడాది జరగనున్న ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ తరపున ప్రచారం చేయాలని బిజెపి నాయకత్వం ఆలోచనగా ఉంది. పరాస్ గవర్నర్ కావడానికి అంగీకరిస్తారని బీజేపీ నాయకత్వం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌) కంటే మెరుగైన రాజకీయ, సామాజిక నెట్‌వర్క్‌ ఎన్‌డీఏలోనే ఉందని మేము నొక్కిచెబుతూనే ఉన్నామని సరాఫ్ అన్నారు.
2025 ఎన్నికలపై దృష్టి
2020 అక్టోబర్‌లో మాజీ కేంద్ర మంత్రి, LJP అధినేత రామ్‌విలాస్ పాసవాన్ మరణించిన తరువాత, అతని రాజకీయ, సామాజిక వారసత్వంపై అతని సోదరుడు పరాస్, కుమారుడు చిరాగ్ మధ్య పోరాటం చెలరేగింది. పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది.
ఎన్‌డిఎలో పెద్ద శక్తిగా పరాస్ తిరిగి రావడం చిరాగ్‌ భవిష్యత్ సందేశంగా భావించవచ్చు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్‌డిఎను క్రమబద్ధీకరించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలలో ఇది కూడా భాగం. ఎన్డీయే మిత్రపక్షాల మధ్య కుమ్ములాట కారణంగా దళితుల ఓట్లు చీలిపోకుండా చూడడమే ఈ వ్యూహం లక్ష్యం.
అయితే, బీజేపీ, పరాస్‌కు చెందిన ఆర్‌ఎల్‌జేపీ మధ్య తాజా చర్చలు బీహార్‌కే పరిమితం కాలేదు. జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు కూటమి భాగస్వాములు కలిసి ఉండేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
J&K ఎన్నికలు
పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్‌ఎల్‌జేపీ కశ్మీర్ ప్రాంతంలో కనీసం రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. సంజయ్ సరాఫ్‌ను శ్రీనగర్, అనంతనాగ్‌ల నుంచి పోటీ చేయాలని పరాస్ కోరారు.
“జమ్మూ కాశ్మీర్‌లో పోటీ చేస్తున్న బీజేపీకి RLJP మాత్రమే అధికారిక భాగస్వామి. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల పొత్తు కోసం బిజెపి నాయకత్వం ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతోందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, అయితే ఇప్పటివరకు ఎన్‌డిఎలో భాగమైంది ఆర్‌ఎల్‌జెపి మాత్రమే” అని సరాఫ్ అన్నారు.
పరాస్‌తో బీజేపీ బలపడుతుండగా, చిరాగ్ మద్దతును కూడా నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళిత ఓటరు బేస్‌ను వ్యతిరేకించాలని బీజేపీ నాయకత్వం భావించడం లేదు.
దళితుల ఓటు బ్యాంకు
" బీహార్ అసెంబ్లీలో బిజెపి రెండవ అతిపెద్ద పార్టీ, కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని చిన్న పార్టీల మద్దతు అవసరం" అని ఉజ్జయినిలోని ఎంపి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్‌కి చెందిన యతీంద్ర సింగ్ సిసోడియా ది ఫెడరల్‌తో అన్నారు.
" బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కొంతమంది నాయకులను విస్మరించడం ద్వారా దళిత సమాజానికి కోపం తెప్పించడం బిజెపికి ఇష్టం లేదు. ఈ నాయకులు పరిమిత ఉనికిని కలిగి ఉన్నారని, వారు కొన్ని నియోజకవర్గాలలో మాత్రమే ప్రభావం చూపుతారని బిజెపి నాయకత్వానికి తెలుసు" అని ఆయన చెప్పారు.
Tags:    

Similar News