మేఘాలయ హత్య కేసు: తాను అమాయకురాలు అంటున్న సోనమ్
భర్త హత్యకు ప్రణాళిక రచన చేసిదంటున్న మేఘాలయ పోలీసులు;
By : The Federal
Update: 2025-06-10 13:44 GMT
మేఘాలయ హనీమూన్ మిస్టరీలో హత్యకు గురైన బాధితుడు రాజా రఘువంశీ మాయం అయి శవంగా మారడంలో తన ప్రమేయం లేదని ఆయన భార్య సోనమ్ రఘువంశీ అన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లోని రోడ్డు పక్కన ఉన్న ధాబా వద్ద అరెస్ట్ అయిన సోనమ్, తనను కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చారని, తాను రాజాను హత్య చేయలేదని చెప్పింది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన సోనమ్ వారణాసి- ఘాజీపూర్ హైవేలోని కాశీ ధాబా వద్ద పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచే నిందితురాలు కుటుంబ సభ్యులను సంప్రదించిందని వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సోనమ్ అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
అరెస్ట్ అనంతరం సోనమ్ ను చికిత్స కోసం సదర్ ఆస్పత్రికి పంపారు. ప్రస్తుతం వన్ స్టాప్ సెంటర్ లో ఉంచారు. ఇది ఆపదలో ఉన్న మహిళలకు వైద్య, న్యాయ సహాయం అందిస్తుంది.
సోనమ్ కుటుంబం మద్దతు..
సోనమ్ తండ్రి దేవీ సింగ్ రఘువంశీ మాట్లాడుతూ.. ‘‘ నా కూతురు నిర్ధోషి, ఆమె తన భర్తను చంపి ఉండదు. ఆమె నిన్న రాత్రి ఘాజీపూర్ లోని ఒక ధాబాకు వచ్చి తన సోదరుడికి ఫోన్ చేసింది. తరువాత పోలీసులు ఆమెను తీసుకెళ్లారు’’ అని అన్నారు. వీరి పెళ్లి పెద్దల అంగీకారంతో జరిగిందని తరువాత కొన్ని రోజులకు హనీమూన్ కు వెళ్లారని కుటుంబం చెబుతోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం ఘాజీపూర్ లోని వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ.. సోనమ్ హత్య ఆరోపణలను ఖండించిందని చెప్పారు. ‘‘మధ్యాహ్నం తరువాత మేల్కొన్న ఆమె తనను కిడ్నాప్ చేశారని, తాను ఎవరిని చంపలేదని చెప్పింది’’ అని సిబ్బంది తెలిపారు.
ఖండించిన పోలీసులు..
మేఘాలయ పోలీసులు మాత్రం సోనమ్ తన భర్త హత్యకు కుట్ర పన్నిందని పేర్కొన్నారు. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐ నోంగ్ రాంగ్ మూడు రాష్ట్రాలలో మానవ వేటకు దారితీసిన పరిస్థితులను, నేరం వివరాలను వెల్లడించారు.
తన ప్రేమికుడు అని అనుమానం ఉన్న రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త సోనమ్ హత్యకు కుట్రపన్నిందని, జూన్ 8 న ఆమె ఒత్తిడి మేరకు లొంగిపోయిందని ఆయన చెప్పారు. దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రాజ్ సింగ్ కుశ్వాహా, ఆకాశ్ రాజ్ పుత్, విశాల్ చౌహాన్ లను ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మే 23న ఆ జంట అదృశ్యమైంది. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ లోని వీసావ్ డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయ నుంచి జూన్ 2న రాజా మృతదేహం బయటపడింది. మే 11న ఇండోర్ లో వివాహం చేసుకున్న జంట హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు.
సోనమ్ ప్రణాళిక..
ఈ హత్య కేసులో తనను తాను బాధితురాలిగా చూపించుకునేందుకు సోనమ్ ప్రణాళిక రచించిందని యూపీ పోలీసులు వెల్లడించారు. తనకు మాదక ద్రవ్యాలు తాగించి ఘాజీపూర్ కు తీసుకు వచ్చారని యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
పోలీసులు చివరకు తనను పట్టుకుంటారని అనుకుని తన కుటుంబ సభ్యులకి విషయం చెప్పిందని యూపీ అదనపు డైరెక్టర్ జనరల్( లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ జాతీయ మీడియాకు తెలిపారు.
సీనియర్ పోలీస్ అధికారుల ప్రకారం.. ఈ కుట్రకు ప్రణాళిక రచించింది సోనమ్ రఘువంశీ అన్నారు. తన ప్రణాళిక చాలా బలహీనంగా ఉందని అన్నారు. పోలీస్ విధానాల గురించి అవగాహాన లేదని బాధితురాలిగా చూపించి తప్పించుకోవచ్చని భావించిందన్నారు.
కానీ ఇందులో పూర్తిగా విఫలమైందని చెప్పారు. మేఘాలయా తీసుకెళ్లి మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో పడేస్తే ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నారని, కానీ ప్రణాళిక విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం దర్యాప్తులో యూపీ పోలీసులు చేరలేదు. ఈ కేసును మేఘాలయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు ప్రధాన అనుమానితురాలు అయిన మహిళ ఘాజీపూర్ కు ఒంటరిగా వచ్చిందని ఈ ప్రయాణానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని త్వరలో నిజం బయటకు వస్తుందని యూపీ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
చిక్కుముడి ఉందా?
రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ మాట్లాడుతూ.. రాజ్ సోనమ్ ఉద్యోగి అని, వారు ఫోన్ లో చాలాసార్లు మాట్లాడుకునే వారని అన్నారు. ‘‘నేను రాజ్ కుశ్వాహాను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడే అతని పూర్తి పేరు విన్నాను’’ అని ఆయన జాతీయ మీడియాకు చెప్పారు. హత్యలో సోనమ్ ను ను నేరుగా నిందించకపోయినా రాజ్ కుశ్వాహా ప్రమేయం ఉంటే ఆమె కూడా హత్యలో పాల్గోనేందుకు అవకాశం ఉందన్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. కేసును ఛేదించిన పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సయిమ్ బాధితురాలి భార్య, ఆమె భాగస్వామి రాజ్ కుశ్వాహ ను ఇరికించేందుకు గణనీయమైన ఆధారాలు లభించాయని అన్నారు.