జనాభా లెక్కల కోసం అధికారిక నోటిఫికేషన్ జారీ

మార్చి 1, 2027 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం;

Update: 2025-06-16 07:59 GMT

జనాభా గణనతో పాటు కుల గణన చేపడుతున్నట్లు కేంద్రం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత దేశ 16 జనాభా లెక్కింపు కోసం ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

దేశంలో చివరిసారిగా 2011 లో జనాభా లెక్కించారు. నిజానికి 2021 లో జనాభా లెక్కలు జరగాల్సి ఉండగా, వాటిని చైనా వైరస్ కల్లోలం కారణంగా నిలుపుదల చేశారు.

ఉత్తరాదిలో తీవ్రంగా మంచుకురిసే లఢక్ వంటి ప్రాంతాలలో అక్టోబర్ 1, 2026, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మార్చి 1, 2027న జనాభా లెక్కలు అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది.

మార్చి 1, 2027 తో ప్రారంభం..
‘‘ఈ జనాభా లెక్కల తేదీ 2027 మార్చి1న తేదీ మధ్యాహ్న 00.00 గంటలు( 12 గంటలు) గా ఉంటుందని, కేంద్ర పాలిత ప్రాంతమైన లఢక్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు కురిస్తే ప్రాంతాలలో మినహయింపు ఉంది’’ అని నోట్ లో కేంద్రం పేర్కొంది.
‘‘జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో లడఖ్, మంచుతో కప్పబడిన నాన్ సింక్రోనస్ ప్రాంతాలకు సంబంధించి సూచన తేదీ 2026 అక్టోబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 00.00 గంటలుగా ఉందని తెలియజేసింది.
34 లక్షల మంది సిబ్బంది.. 1.3 లక్షల మంది జనాభా లెక్కల అధికారి..
దేశవ్యాప్తంగా జనాభా సంబంధిత డేటాను అందించే భారీ కసరత్తును దాదాపు 34 లక్షల మంది గణనదారులు, పర్యవేక్షకులు, డిజిటల్ పరికరాలతో 1.3 లక్షల మంది జనాభా అధికారులు నిర్వహిస్తారు. జనాభా లెక్కింపు తో పాటు కులగణన కూడా చేపట్టబోతున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రజలకు స్వీయ గణన సదుపాయం కూడా అందుబాటులో ఉందని పేర్కొంది.
రెండు దశలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలోని కేంద్ర హోంకార్యదర్శి, రిజిస్టార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషనర్ మృతుంజయ్ కుమార్ నారాయణ్ ఇతర సీనియర్ అధికారులతో జనాభా లెక్కల సన్నాహాలను సమీక్షించారు.
జనాభా లెక్కల గణన రెండు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటి దశలో గృహాల జాబితా ఆపరేషన్(హెచ్ఎల్ఓ) ప్రతి ఇంటి గృహ పరిస్థితులు ఆస్థులు, సౌకర్యాలను సేకరిస్తారు.
రెండో దశలో జనాభా గణన ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి జనాభా, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక ఇతర వివరాలు సేకరిస్తారు. ఈ జనాభా గణన ప్రారంభమైనప్పటి నుంచి 16 వ జనాభా గణన, స్వాతంత్య్రం తరువాత ఎనిమిదో జనాభా గణన అని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
సేకరణ, ప్రసారం, నిల్వ సమయంలో డేటా భద్రతను నివారించడానికి చాలా కఠినమైన డేటా భద్రతా చర్యలు అమలులో ఉంటాయని ప్రకటన పేర్కొంది.
Tags:    

Similar News