‘‘జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించండి’’

సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు ప్యానెల్, యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదు కట్టలు;

Update: 2025-06-19 11:18 GMT
జస్టిస్ యశ్వంత్ శర్మ

అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జీ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుంచి 1.5 అడుగుల ఎత్తులో సగం కాలిన స్థితిలో పెద్ద మొత్తంలో నగదు దొరికిందని సుప్రీంకోర్టు నిర్థారించింది.

ఈ విషయంపై అత్యన్నత న్యాయస్థానం ముగ్గురు ప్యానెల్ ఆయనను తొలగించాలని సిఫార్సు చేసింది. మార్చి 14న ఢిల్లీలోని తన ప్రభుత్వ నివాసం, 30 తుగ్లక్ క్రీసెంట్ లో ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన, పాక్షికంగా కాలిపోయిన కరెన్సీ నోట్లు బయటపడ్డాయి.

దీనితో జస్టిస్ వర్మ వివాదంలో చిక్కుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడూ ఆయన ఇంట్లో లేరు. మార్చి 22న సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. వార్తా నివేదికల ప్రకారం.. న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలు నిజమైనవని ప్యానెల్ కనుగొంది.

ప్యానెల్ ఫలితాలు..
పదిరోజుల పాటు, జస్టిస్ వర్మ కుమార్తెతో సహ 55 మంది సాక్షులను విచారించింది. అగ్నిమాపక సిబ్బంది నుంచి సాక్ష్యాలను అలాగే పోలీస్ సిబ్బంది నుంచి సాక్ష్యాలు సేకరించింది.
స్టోర్ రూమ్ అంతస్తులో రూ. 500 నోట్ల పెద్ద కుప్ప కనిపించిన వీడియోలు, ఫొటోలను సేకరించింది. ప్యానెల్ విచారించిన కనీసం 10 మంది సాక్షులు కాలిపోయిన లేదా సగం కాలిపోయిన కరెన్సీ నోట్లను చూసినట్లు అంగీకరించారు.
‘‘ఇంత పెద్ద మొత్తంలో నగదు చూసి నేను షాక్ కు గురయ్యాను, ఆశ్చర్యపోయాను. నా జీవితంలో ఇలాంటిది చూడటం ఇదే మొదటిసారి’’ ఒక సాక్షి ప్యానెల్ తో చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఆయన అసహజ ప్రవర్తన, సంఘటన నివేదించడంలో కొన్ని లోపాలను ఎత్తి చూపారు.
సరైన వివరణ ఇవ్వలేని న్యాయమూర్తి..
తన ఇంట్లో ఉన్న డబ్బు గురించి తనకు తెలియదని న్యాయమూర్తి చేసిన వాదన ఆమోదయోగ్యంగా లేదని ప్యానెల్ పేర్కొంది. ఏదైన కుట్ర ఉంటే న్యాయమూర్తి ఎందుకు ఫిర్యాదు చేయలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా భారత ప్రధాన న్యాయమూర్తికి ఎందుకు తెలియజేయలేదని నివేదిక ప్రశ్నించింది.
అదే కాకుండా స్టోర్ రూమ్ లోకి జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రత్యేక ప్రవేశం, నియంత్రణ ఉంది. అక్కడ మంటలు చెలరేగాక నగదు ఉన్నట్లు బయటపడింది.
బలమైన అధారాల కారణంగా మార్చి 15, 2025 లో తెల్లవారుజామున స్టోర్ రూమ్ నుంచి కాలిపోయిన నగదు, డబ్బును కూడా ఆయన నివాసం నుంచి కనుగొన్నట్లు ప్యానెల్ తెలిపింది.
ఇంటిలో పనిచేసే సిబ్బంది నగదును చూడలేదని తిరస్కరించినప్పటికీ పోలీస్, అగ్నిమాపక అధికారుల స్వతంత్ర పై అనుమానించడానికి ఎటువంటి కారణం లేదని ప్యానెల్ భావించింది.
కుట్ర లేదు..
ఈ ఎపిసోడ్ తన ప్రతిష్టను దిగజార్చడానికి జరిగిన కుట్రగా జస్టిస్ వర్మ చేసిన వాదనను కూడా కమిటీ తోసిపుచ్చింది. నివేదిక ప్రకారం.. కరెన్సీ నోట్లను చాలామంది వ్యక్తులు చూశారు. వాటిని రియల్ టైమ్ లో రికార్డు చేశారు. ఇది జస్టిస్ వర్మను ఇరికించడానికి జరిగిన నాటకం కాదని ప్యానెల్ భావించింది.
జస్టిస్ వర్మ ప్రయివేట్ కార్యదర్శి రాజిందర్ సింగ్ కర్కి, ఆయన కుమార్తె దియా వర్మ కూడా సాక్ష్యాల విధ్వంసం లేదా సంఘటన స్థలాన్ని శుభ్రపరచడంలో కీలకపాత్ర పోషించారని ప్యానెల్ పేర్కొంది.
అలహాబాద్ బదిలీ..
ఈ వివాదం చెలరేగిన తరువాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే అతనికి ఎటువంటి న్యాయపరమైన పని అప్పగించలేదు. అయితే న్యాయమూర్తి తాను నిర్దోషినని, రాజీనామా చేయలేదని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ ను తీసుకోబోనని చెప్పారు.
ఆయన విచారణ ప్రక్రియను మొత్తం ప్రాథమికంగా అన్యాయం అని అభివర్ణించారు. ముగ్గురు న్యాయమూర్తుల దర్యాప్తు ప్యానెల్ ప్రతి ప్రకటనను వీడియో రికార్డ్ చేసింది.
ఈ ప్యానెల్ లో పంజాబ్ - హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జీఎస్ సంధవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు.
Tags:    

Similar News