వాక్ స్వేచ్ఛపై ఎలాంటి అడ్డుంకులు లేవు కానీ.. : సుప్రీంకోర్టు
ఇప్పుడే ఏం వ్యాఖ్యలు చేయమన్న ఉన్నత న్యాయస్థానం;
By : The Federal
Update: 2025-05-28 13:48 GMT
అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన షరతులను సవరించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అలాగే వాక్ స్వాతంత్య్రం పై కూడా ఎటువంటి అడ్డంకులు లేవని, అతనిపై నమోదయిన కేసుల సందర్భంగా ఆన్ లైన్ లో పోస్టు చేయకుండా నిషేధం ఉందని పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేసినందుకు మే 18న హర్యానా పోలీసులు మహ్మదాబాద్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు మే 21న ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మహ్మాదాబాద్ పై ఆంక్షలు
విచారణలో ఉన్న రెండు ఆన్ లైన్ పోస్ట్ లలో దేనికీ సంబంధించిన ఆన్ లైన్ పోస్ట్ లేదా వ్యాసం రాయకూడదని లేదా ప్రసంగం చేయకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం నిందితుడికి సూచించింది.
భారత భూభాగంలో జరిగిన ఉగ్రవాద దాడి, భారత సైన్యం ప్రతీకారం గురించి మహ్మదాబాద్ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా బెంచ్ నిషేధం విధించింది.
హర్యానా పోలీసులకు సూచనలు
పీటీఐ నివేదిక ప్రకారం.. ప్రొఫెసర్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ తేదీన దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్ ను ఆదేశించింది.
దర్యాప్తులో గీత దాటవద్దని, పోలీసులు పరిశీలిస్తామని చెప్పిన పరికరాలను వెతకాలని కోర్టు హర్యానా పోలీసులను కోరింది. ప్రొఫెసర్ పై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసుకు తమ స్పందన గురించి తెలియజేయాలని కూడా హర్యానా పోలీసులను కోరింది.
ప్రొఫెసర్ అరెస్ట్ పై మీడియాలో వచ్చిన కథనాన్ని సుమోటా కాగ్నిజెన్స్ గా తీసుకున్నట్లు మే 21న ఎన్ హెచ్ ఆర్సీ పేర్కొంది. ‘‘ఆయనను అరెస్ట్ చేయడానికి గల ఆరోపణలు ఉన్న ఈ నివేదికలో ప్రొఫెసర్ కు సంబంధించిన మానవ హక్కులు, స్వేచ్చను ఉల్లంఘించినట్లు వెల్లడిస్తుంది’’ అని పేర్కొంది.
కేసు నేపథ్యం
ఆపరేషన్ సిందూర్ తరువాత దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా అలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్టులు దేశ సార్వభౌమత్వం, సమగ్రతను ప్రమాదంలో పడేశాయని ఆరోపిస్తూ అతనిపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ ల ఆధారంగా మే 18న హర్యానా పోలీసులు అలీఖాన్ ను అరెస్ట్ చేశారు.
హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా, ఒక గ్రామ సర్పంచ్ దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా సోనిపట్ జిల్లాలోని రాయ్ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
‘‘కమిషన్ చైర్ పర్సన్ ఫిర్యాదు మేరకు ఆశోక విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అలీపై బీఎన్ఎస్ సెక్షన్లు 152(భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను సమగ్రతను ప్రమాదంలో పడవేసే చర్యలు) 353 (ప్రజా దుశ్చర్యకు దారితీసే ప్రకటనలు), 79 (మహిళలను అవమానించే లక్ష్యంతో చేసే ఉద్దేశపూర్వక చర్యలు), 196(1) (మతం ఆధారంగా వివిద సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రొత్సహించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.