ఏ ఒప్పందం కుదిరినా ఆయుధాలు మాత్రం సకాలంలో అందలేదు: ఐఏఎఫ్ చీఫ్
ఒప్పందం కుదిరిన సమయానికే అందించకపోతే ఎలా ప్రశ్నించిన అమర్ ప్రీత్ సింగ్;
By : The Federal
Update: 2025-05-29 12:15 GMT
కీలకమైన రక్షణ కొనుగోళ్ల లో జరుగుతున్న తీవ్ర జాప్యం పై ఎయిర్ చీఫ్ మార్షల్ మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
రక్షణ కొనుగోళ్ల ఒప్పందంపై సంతకం చేసిన తరువాత కూడా పరికరాలు సకాలంలో అందవని చాలాసార్లు తాను కచ్చితంగా భావించానని అన్నారు. మరో అడుగు ముందడుగు వేసి ప్రాజెక్ట్ లను పూర్తి చేయడం ఒక పెద్ద సమస్య అని, సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టను కూడా తనకు గుర్తులేదని చెప్పారు.
ప్రధాన రక్షణ ప్రాజెక్ట్ ల ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ప్రకటించిన అవాస్తవిక కాలక్రమాలు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. చేయలేని, సకాలంలో పూర్తి కాని కొన్ని విషయాలు ఎందుకు హమీ ఇవ్వాలని అన్నారు.
ఎల్ సీఏ ప్రాజెక్ట్ లో తీవ్ర జాప్యం..
అనేక ప్రధాన రక్షణ ప్రాజెక్ట్ లు, ముఖ్యంగా లైట్ కంబాట్ ఎయిర్ క్రాప్ట్ (ఎల్సీఏ- తేజస్) ప్రొగ్రామ్ వంటి స్వదేశీ ఆయుధ వ్యవస్థలొ జరుగుతున్న జాప్యాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
తేజస్ ఎంకే1ఏ కంబాట్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదని సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తో 83 యుద్ధ విమానాలు సరఫరా చేయడానికి రూ. 48 వేల కోట్ల ఒప్పందం పై 2021 లో సంతకాలు జరిగాయని అన్నారు. నిబంధనల ప్రకారం 2024 లో విమానాలను డెలివరీ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ ఒక్కటి కూడా రాలేదని అననారు.
ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తేజస్ ఎంకే2 నమూనా ఇంకా విడుదల కాలేదని, కానీ ఐదోతరం యుద్ద విమానం అయిన అడ్వాన్స్ డ్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) నమునా విడుదల చేశారని, ఇవి స్టెల్త్ లక్షణాలతో ఉందని అన్నారు.
ఒప్పందం అయ్యాక డెలివరీ చేయాలి..
రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ మాట్లాడారు. భారతదేశంలో కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే చర్చలకే పరిమితం కావద్దని, డిజైన్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘‘మనం చాలా ఓపెన్ గా ఉండాలి. మనం ఏదైనా చేయడానికి కట్టుబడి ఉన్న తరువాతనే మనం దానిని తప్పక అందించాలి. భారత్ లో తయారు చేయడానికి వైమానిక దళం తన వంతు కృషి చేస్తోంది’’ అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి..
సైన్యం భవిష్యత్ సవాళ్లకు సిద్దంగా ఉండాలని నొక్కి చెప్పారు. పరిశ్రమ నుంచి వచ్చే ఉత్పత్తి రాబోయే పది సంవత్సరాలలో పెరుగుతుందని ఐఏఎఫ్ చీఫ్ అన్నారు. సాయుధ దళాలను సాధికారపరచడం ద్వారా యుద్ధాలు గెలుస్తారని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ ను జాతీయ విజయంగా అభివర్ణించారు. సాయుధ దళాలు కలిసి చాలా ప్రొఫెషనల్ పద్దతిలో దీనిని అమలు చేశాయని సింగ్ అన్నారు.
‘‘మనం ఇంతకాలం మాట్లాడుకున్న ఆ ఆపరేషన్ సిందూర్ జాతీయ విజయం, ప్రతి భారతీయుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి భారతీయుడి ఈ విజయం వైపు ఎదురు చూస్తున్నాడని నాకు కచ్చితంగా తెలుసు’’ అని ఐఏఎఫ్ చీఫ్ అన్నారు.