విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు వేళల మార్పు
మరికొన్ని రైళ్ల సర్వీసుల పొడిగింపు
By : The Federal
Update: 2025-12-13 05:49 GMT
సంక్రాంతి రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో భాగంగా జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు వేళల్ని మార్పు చేశారు. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్ని దక్షిణ మధ్య రైల్వే మార్చింది. కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. విశాఖపట్నం-లింగంపల్లి (12806) రైలు విశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరి రాత్రి 7.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం(12805) రైలు ఉదయం 6.55కి లింగంపల్లి నుంచి బయల్దేరి, విశాఖపట్నంకు రాత్రి 7.50కి చేరుకుంటుంది.
మరికొన్ని వీక్లీ రైళ్ల వేళల్ని క్రమబద్ధీకరించడమో లేక పొడిగించడమో చేశారు. సికింద్రాబాద్-అనకాపల్లి (నెంబరు 07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అనకాపల్లి-సికింద్రాబాద్(నెంబరు 07042) రైలు జనవరి 5, 12, 19న, హైదరాబాద్-గోరఖ్పుర్(నెంబరు 07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్పుర్-హైదరాబాద్(నెంబరు 07076) రైలు జనవరి 11 18, 25 తేదీల్లో బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.