అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ..

ఆంధ్ర ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విడుదల చేశారు.

Update: 2024-04-06 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ శుక్రవారం ఉదయం ప్రకటించారు. పొత్తులో భాగంగా తమకు ఒక ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్ కేటాయించిందని ఆయన వెల్లడించారు. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాయని, లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కటమితో కలిసి తాము నడవనున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా తమ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్.. సీపీఐకు మద్దతు ఇస్తుందని, మిగిలి సీట్లలో సీపీఐ.. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు.

గుంటూరు లోక్‌సభ స్థానానికి సీపీఐ తరపున కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ అభ్యర్థులు

విజయవాడ పశ్చిమం - జీ కోటేశ్వరరావు

అనంతపురం అర్బన్ - సీ జాఫర్

పత్తికొండ - పీ రామచంద్రయ్య

విశాఖ పశ్చిమం - అత్తిలి విమల

ఏలూరు - బండి వెంకటేశ్వరరావు

తిరుపతి - పీ మురళి

కమలాపురం - గాలి చంద్ర

రాజంపేట - భూక్య విశ్వనాథ నాయక్

Tags:    

Similar News