వైసీపీ తప్పులను బాబుపై నెట్టేస్తున్నారా!

నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి హయాంలో జరిగిన తప్పులను బాబుపై నెట్టేస్తున్నారని ఆరోపించారు.

Update: 2024-04-04 11:06 GMT

‘వైసీపీ రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, తప్పుడు కేసులు పెట్టడం అంతా పరిపాటిగా మారిపోయింది. టీడీపీ కార్యకర్త అన్న ఒక్క కారణంతోనే వాళ్లను టార్గెట్ చేయడం జరిగింది’ అని ‘నిజం గెలవాలి’ సభలో టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చేసిన అన్ని తప్పులను వైసీపీ రాక్షసులు.. చంద్రబాబుపై నెట్టివేయడానికి ప్రయత్నించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో మాట్లాడుతూ.. ఆమె మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, ప్రజల సంక్షేమమే చంద్రబాబు ఊపిరి అని ఆమె అన్నారు.

మాఫియాలో ఏపీనే ఫస్ట్
‘‘వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియాలో ముందంజలో ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. మాఫీయాకు రాష్ట్రాన్ని దోచి పెట్టింది. ఈ రాక్ష పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. అది ఓటర్లు చేతులోనే ఉంది. మీరు నొక్కే బటన్‌తోనే ఈ రాక్షపాలనను సంహరించగలం’’అని ఆమె వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
యాత్ర సాగిందిలా
నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కడప, నంద్యాల, డోన్, ప్రొద్దుటూరు, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో సాగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వారికి టీడీపీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
Tags:    

Similar News