విశాఖ కార్పొరేషన్ కూటమి కైవసం
విశాఖ మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. జీవీఎంసీలో ముగిసిన నాలుగేళ్ల వైసీపీ పాలన. 26న కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం.;
తంత్రం ఫలించింది. కూటమి గెలిచింది. అష్టకష్టాలు పడి ఎట్టకేలకు విశాఖ మేయర్ పదవిని కొల్లగొట్టింది. శనివారం జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బొటాబొటీ మెజార్టీతో తీవ్ర ఉత్కంఠ నడుమ నెగ్గింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కూటమి నేతలు వైసీపీకి చెందిన విశాఖ మేయర్ పదవిని ఎలాగైనా తన్నుకు పోవాలని పథక రచన చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం ప్రలోభ పెట్టి కొందరిని, బెదిరించి మరికొందరిని వైసీపీ నుంచి కార్పొరేటర్లను లాక్కున్నారు. 2021లో జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్)కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 స్థానాలకు గాను, వైసీపీ 59 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 29 మంది, ఇండిపెండెంట్లు నలుగురు, జనసేన ముగ్గురు, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. బీసీ జనరల్కు రిజర్వు అయిన ఈ మేయర్ పదవిని యాదవ మహిళ అయిన గొలగాని హరివెంకట కుమారికి వైసీపీ పెద్దలు కట్టబెట్టారు. వైసీపీ అధికారం కోల్పోయే వరకు ఆమె పదవికి ఎలాంటి ఢోకా లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీల నేతలు అవిశ్వాసం ద్వారా మేయర్ను దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసం చెల్లుబాటు కాదన్న నిబంధనతో వేచి ఉన్నారు. ఇంతలో వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసి సఫలీ కృతులయ్యారు. కొందరు టీడీపీలో చేరగా, మరికొందరు జనసేన, బీజేపీల్లో చేరారు. కేవలం 29 మంది సభ్యులు మాత్రమే ఉన్న టీడీపీ.. వైసీపీ నుంచి జంప్ చేసిన వారితో బలం పెంచుకున్నారు. కూటమిలో చేరడానికి వైసీపీ కార్పొరేటర్లకు రూ.లక్షల్లో ముడుపులు చెల్లించారంటూ అంతా బహిరంగంగానే చెప్పుకున్నారు. కొన్నాళ్లుగా విశాఖ మేయర్ను దించేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకున్నాక కూటమి నేతలు జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్కు నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానానికి తేదీని నిర్ణయించారు.
విదేశాల్లో క్యాంపులు..