ఇది కూడా నమ్మాలి కదా జగన్ అన్నా.. వైఎస్ సునీత

ప్రొద్దుటూరు సభలో వైఎస్ వివేకా హత్యకి సంబంధించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత తీవ్రంగా స్పందించారు.

Update: 2024-03-28 14:06 GMT

ప్రొద్దుటూరు సభలో వైఎస్ వివేకా హత్యకి సంబంధించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత తీవ్రంగా స్పందించారు. ఐదేళ్ల క్రితం చిన్నాన్నని చంపించారంటూ ఓట్లు కోసం ఆయన పేరు వాడుకున్నారు. మళ్ళీ ఎన్నికలొచ్చేసరికి ఆయన పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. హంతకులకు ఓటు వేయొద్దంటూ మరోసారి ప్రజలకి ఆమె పిలుపునిచ్చారు.

చిన్నాన్నని చంపింది ఎవరో ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకి తెలుసు అని జగన్ అన్న అన్నారు. చంపిన వ్యక్తికి ఎవరు మద్దతు ఇస్తున్నారో కూడా తెలుసు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకి సునీత కౌంటర్ ఇచ్చారు. చంపిన వ్యక్తి ఎవరు చంపించారో చెబుతున్నారు. ఎందుకు వాళ్ళను రక్షిస్తున్నవు జగన్ అన్న?? చంపిన వాడే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నాడు అని చెప్తే ఎందుకు నమ్మడం లేదు. చంపిన వాడే చెప్తున్నాడు కదా.. ఇది కూడా నమ్మాలి కదా జగన్ అన్నా అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

చంపిన వ్యక్తి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నాన్నని చంపమన్నారని చెప్పాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని వెంటబెట్టుకుని, అతనికి, నాకు ఓట్లేసి గెలిపించమని ఎలా అడుగుతున్నారు? చిన్నాన్న హత్యతో ఎవరు రాజకీయం చేస్తున్నారు అని నిలదీశారు. హంతకులకు, హంతకులకు సపోర్ట్ ఇచ్చేవారికి ఓట్లు వేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

"జగన్ అన్నా నీకు బంధాల విలువ తెలుసా? ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా. చిన్నాన్న చనిపోతే కుట్ర చేధించకుండా నాపై ఆరోపణలు కేసులు పెడుతున్నారు. ఇదేనా అన్నయ్యగా నిర్వర్తించాల్సిన బాధ్యత? నేను ఇలా మాట్లాడానికి కారణం జగన్ తన కర్తవ్యం సరిగా నిర్వహించకపోవడమే. ఒకప్పుడు మీరు సీబీఐ విచారణ అడిగారు తర్వాత వద్దు అన్నారు.. ఎందుకు? మీ పాత్ర బయటకు వస్తుంది అని వద్దు అన్నారా? నిందితుడిని పక్కన పెట్టుకొని ఓటు ఎలా అడుగుతున్నారు? చిన్నాన్న ని చంపిన వారిని ఎందుకు పక్కన పెట్టుకున్నావు? ఎవరు రాజకీయ లాభం చూసుకుంటున్నారు అనేది ప్రజలు గమనించాలని వైఎస్ సునీత అన్నారు.

Tags:    

Similar News