భారత్ జోడో న్యాయ్ యాత్ర: ముగింపు ర్యాలీకి రానున్న స్టాలిన్, అఖిలేష్

ఆదివారం ముంబై లో జరగనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభకు ఇండి కూటమిలోని అతిరథ మహరథులు రానున్నారు.

Update: 2024-03-15 11:51 GMT
కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ

ఆదివారం ముంబైలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు ర్యాలీకి ఇండి కూటమిలోని ముఖ్యనాయకులు రానున్నట్లు సమాచారం. కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే హజరవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ కూడా హాజరుకానున్నట్లు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వదేట్టివార్ చెప్పారు. సెంట్రల్ ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ వద్ద ఈ ర్యాలీ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రతిపక్ష కూటమికి చెందిన ఇతర మిత్రపక్షాల ప్రతినిధులు కూడా హాజరవుతారని ఆయన చెప్పారు.
"లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం ప్రకటించనున్నందున, భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు ర్యాలీ ఖర్చులు మా ఎన్నికల వ్యయంలో చూపెడతామని" అని వడేట్టివార్ చెప్పారు.
రాహుల్ యాత్ర శనివారం మధ్యాహ్నం ముంబైకి చేరుకుంటుంది. అనంతరం దాదర్‌లోని భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అంబేద్కర్ స్మారకం చైత్య భూమిని సందర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా గుండా యాత్ర సాగుతోంది.
Tags:    

Similar News