మోదీ ‘అసాధ్యం’ అనేది లేకుండా చేశారు: అమిత్ షా

భారత దేశంలో అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా ప్రధాని సాధించి చూపారని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2024-03-15 10:00 GMT

దేశంలో అసాధ్యంగా కనిపించే అన్ని అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం సాధించి చూపించిందని అమిత్ షా అన్నారు. దేశాన్ని రెండుగా విడదీస్తూ జమ్మూకాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించిన అధికరణ 370 ని తొలగించామని అన్నారు. సైనిక దళాలకు కలగా ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను దిగ్విజయంగా అమలు చేసి చూపామన్నారు.

గాంధీనగర్ ఎంపీ అయిన అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో రూ.3,012 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“గత కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరిగా అభివృద్ధి పనులు ఏళ్లకు ఏళ్లు కాలయాపన లేకుండా వెంటనే పూర్తి అవుతున్నాయని, ఇక ముందు కూడా పూర్తవుతాయని అన్నారు. గత ఐదేళ్లలో నేను భూమిపూజ చేసిన అన్ని ప్రాజెక్టుల్లో 91 శాతం పూర్తయ్యాయి. ఇది బీజేపీ పని సంస్కృతి'' అని ఢిల్లీ నుంచి వర్చువల్ ప్రసంగంలో షా అన్నారు.
2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక అసంపూర్తి పనులు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ఇచ్చిన హామీపై ప్రతిపక్షాలు మమ్మల్ని చూసి నవ్వుకునేవి. కానీ ఇప్పుడు, బాల రాముడి ప్రాణప్రతిష్ట చేసిచూపాం. ప్రధాని.. ప్రజల కోసం ఆలయ తలుపులు తెరిచారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కావచ్చు లేదా జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించినా, మన ప్రధాని తన పదవీకాలంలో ఇలాంటి అసాధ్యమైన పనులన్నింటినీ పూర్తి చేశారు, ”అని షా అన్నారు.
80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్, పేదలకు 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం, నాలుగు కోట్ల మంది పౌరులకు ఇళ్ల కేటాయింపు, 10 కోట్ల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్, 14 కోట్ల మంది పౌరులకు నీటి కనెక్షన్ వంటివి మోదీ ప్రభుత్వం సాధించిన ఇతర ప్రధాన విజయాలు. "ప్రధానమంత్రి దేశం మొత్తాన్ని సురక్షితంగా, సంపన్నంగా మార్చారు. నేను ఎక్కడికి వెళ్లినా, మోడీ మూడవసారి ప్రధాని అవుతారని సంకేతాలు కనిపిస్తున్నాయి" అని షా అన్నారు.
ఈ వర్చువల్ కార్యక్రమంలో అమిత్ షా సబర్మతి రివర్ ఫ్రంట్ ను 9-కిమీల విస్తరణ, అహ్మదాబాద్‌లోని రద్దీగా ఉండే పంజ్‌పోల్ జంక్షన్‌లో ఓవర్‌బ్రిడ్జ్, నగరంలోని డాని లిమ్డా ప్రాంతంలోని చందోలా సరస్సు సుందరీకరణ వంటి పలు పనులు ఉన్నాయి.
Tags:    

Similar News