ఆర్సీబీ విక్టరీ పరేడ్ అనుమతి ఇవ్వని బెంగళూర్ పోలీసులు

ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపిన ట్రాఫిక్ డిపార్ట్ మెంట్;

Update: 2025-06-04 11:03 GMT
ఆర్సీబీ జట్టు

సుదీర్ఘ నిరీక్షణ తరువాత తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీకి బెంగళూర్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే విక్టరీ పరేడ్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం చిన్నస్వామి స్టేడియంలోనే చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.

మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన ఉత్కంఠభరిమైన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు పరుగులు తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల నుంచి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీకి నిరీక్షణకు నిన్నటితో ముగింపు దొరికింది.
ట్రాఫిక్ సమస్యలు..
బెంగళూర్ జట్టు తొలిసారి విజయం సాధించడంతో భారీ వేడుకలు నిర్వహించాలని అంతా అనుకున్నారు. కానీ దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు.
విజయం తరువాత ఈ రోజు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు విజయోత్సవ పరేడ్ ఉంటుందని ఫ్రాంచైజీ తొలుత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. విధాన సౌధ నుంచి ప్రారంభం అయి, సాయంత్రం ఆరు గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుందని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కానీ పోలీసులు మాత్రం దీనికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తేల్చివేశారు.
జాతీయ మీడియా ప్రకారం అధికారులు అనుమతి నిరాకరించడానికి ట్రాఫిక్ సమస్యలు, పైగా అది ప్రైమ్ టైమ్ కావడం కారణంగా పేర్కొన్నారు.
సలహాలు..
విజయోత్సవ ర్యాలీ బదులు చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సన్మాన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ విధాన సౌధ, స్టేడియం చుట్టూ ఉన్న రోడ్లకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.
అలాగే స్టేడియంలోకి అనుమతించాలంటే కచ్చితంగా పాస్ లు ఉండాలని కూడా సూచన జారీ చేశారు. అలాగే ట్రాఫిక్ సమస్యను నివారించడానికి మెట్రో, ప్రజా రవాణా వ్యవస్థలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
Tags:    

Similar News