ఒక్క రోజులో 4 కోవిడ్ మరణాలు..
శ్వాసకోశ వ్యాధుల కారణంగానే చిన్న వయస్సువారు కూడా కోవిడ్తో చనిపోతున్నారు - డాక్టర్ వినోద్;
COVID డాష్బోర్డ్ ప్రకారం..దేశంలో గడిచిన 24 గంటల్లో నాలుగు COVID మరణాలు సంభవించాయి. ఆదివారం (జూన్ 1) తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఢిల్లీలో 22 ఏళ్ల మహిళ చనిపోయింది. తమిళనాడులో 25 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యుక్త వయసులో ఉన్న వారు కూడా చనిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే గతంలో వారికి ఉన్న శ్వాసకోశ ఇబ్బందులేని వారి మరణానికి కారణమని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ హాస్పిటల్లోని కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వినోద్ చెబుతున్నారు. ఈ మధ్యే తమిళనాడులో ఇద్దరు చనిపోయారు. 2020 నుంచి రాష్ట్రంలో కోవిడ్తో చనిపోయిన వారి సంఖ్య 38,088.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం దేశంలో COVID యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలు. కేరళలో అత్యధికంగా 1,435 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్రలో 506 యాక్టివ్ కేసులు, ఢిల్లీలో 483, గుజరాత్లో 338, పశ్చిమ బెంగాల్లో 331 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జనవరి నుంచి మొత్తం 2,188 మంది COVID నుంచి కోలుకున్నారు.