‘‘ అభివృద్దిని చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి’’: ఫరూక్ అబ్ధుల్లా

కట్రా నుంచి శ్రీనగర్ వరకూ వందే భారత్ లో ప్రయాణించిన మాజీ సీఎం;

Update: 2025-06-10 13:01 GMT
ఫరూక్ అబ్దుల్లా

నేషనల్ కాన్పరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మంగళవారం శ్రీనగర్ నుంచి కాట్రా వరకూ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ లో ప్రయాణించారు. జమ్మూకాశ్మీర్ చివరి మూలవరకూ రైల్వే నెట్వర్క్ రావడంతో తాను సంతోషంగా ఉన్నానని ఆయన అన్నారు.

అమర్ నాథ్ యాత్రికులు ఈ రైల్వే సేవలను వినియోగించుకుంటారని వారు పెద్ద సంఖ్యలో జమ్మూకశ్మీర్ కు వస్తారని తాను ఆశిస్తున్నట్లు మాజీ సీఎం చెప్పారు. అమర్ నాథ్ యాత్ర సముద్రమట్టం నుంచి 3,880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో కొలువై ఉంది.
ఈ యాత్ర జూలై 3న కశ్మీర్ లోని హిమాలయలలో ప్రారంభం అవుతుంది. జూన్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్రా నుంచి శ్రీనగర్, శ్రీనగర్ నుంచి కట్రా వరకూ రెండు రైళ్లు ప్రారంభించారు. దీనితో కశ్మీర్ ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే 272 కిలోమీటర్ల మీటర్ల ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ పూర్తయింది.
సంతోషంతో నా హృదయం ఉప్పొంగిపోయింది 
‘‘కశ్మీర్ ను చివరకు దేశ రైలు నెట్వర్క్ ను అనుసంధానించడం చూసి నా హృదయం ఉప్పొంగిపోయింది. నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి. దీన్ని సాధ్యం చేసిన ఇంజనీర్లు, కార్మికులను నేను అభినందిస్తున్నాను’’ అని రైలు దిగిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
ఈ రైలు సేవలు ప్రజలకు లభించిన అతిపెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. ఎందుకంటే ఇది ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుంది. రెండు ప్రాంతాల మధ్య ప్రేమ, స్నేహాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు.
రాబోయే తీర్థయాత్ర సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులు అమర్ నాథ్ మందిర దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా కుమారుడు జమీర్, జహీర్, జమ్మూకాశ్మీర్ మంత్రి సతీష్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ అస్లాం వాని, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యప్రతినిధి తన్వీర్ సాదిక్ కూడా అబ్దుల్లాతో పాటు ఆయన రైలు ప్రయాణంలో పాల్గొన్నారు.
‘‘శ్రీనగర్ నుంచి కాట్రా వరకూ మా మొదటి రైలు ప్రయాణం నిజంగా ఆకట్టుకుంది. ఈ ప్రయాణం ఐకానిక్ అంజి వంతెనను దాటుతుంది. అద్భుతమైన సొరంగాల గుండా వెళ్తోంది. ఒక అద్బుతమైన అనుభవం’’ అని సాదిక్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. తమ పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలను సైతం అందులో పోస్ట్ చేశారు.
ఈ రైలు కశ్మీర్ నుంచి ఉద్యానవన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు అంటే కన్యాకుమారి, ముంబై, కోల్ కత, బీహార్ లకు రవాణా చేయడానికి ఉపయోగపడుతుందని అబ్ధుల్లా అన్నారు.
రహదారి మూసివేతలు ఉండవు
‘‘కొన్ని సార్లు రహదారులు మూసివేయబడతాయి. (శీతాకాలంలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారి మూసివేస్తారు) విమానయాన సంస్థలు ధరలు పెంచడం ద్వారా ప్రజలను దోచుకోవడం ప్రారంభిస్తాయి. ఈ రైలుతో ప్రజలు వాటి నుంచి రక్షింపబడతారు’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ అన్నారు.
ఈ రైల్వే నెట్వర్క్ వల్ల కశ్మీర్ ఉద్యానవన రంగానికి అనుకూలంగా ఉంటుందని, పంటలు చాలా వేగంగా మార్కెట్లకు చేరుకుంటాయని అబ్ధుల్లా అన్నారు. ‘‘ఇది కాశ్మీర్ ను సందర్శించే పర్యాటకులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ఆయన అన్నారు.
Tags:    

Similar News