ఎస్పీ బాలుకి తమిళనాడులో అరుదైన గౌరవం
ప్రపంచ ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు నాట లభించని అరుదైన గౌరవం తమిళనాట లభించింది.
గానగంధర్వుడు, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం దిక్కింది. తెలుగు వాడైన బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు నేలపైన దొరకని ఆ గుర్తింపు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో లభించడం విశేషం. చెన్నై నగరంలోని ఓ ప్రముఖ రోడ్డుకు బాలు పేరును పెట్టాలని ఖరారు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాలుపై ఉన్న గౌరవాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ విధంగా చూపించారు. నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు బాలు పేరు పెట్టారు. కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఇక నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవనున్నారు.
ఎస్పీ బాలు చెన్నైలో నుంగంబాక్కం ఏరియాలో నివసించేవారు. ఈ నేపథ్యంలో నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు బాలు పేరు పెట్టారు. కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేశారు. ఆ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కార్యాలయం నుంచి ప్రకటనను విడుదల చేసింది.