అందరూ మెచ్చుకునేలా అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ మెచ్చేలా తయారవుతుందా? అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటున్నారు. ఏమి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ను అందరూ మెచ్చుకునేలా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుం బిగించారా? అవుననే సమాధానం వస్తోంది. గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో అసంతపూర్తి నిర్మాణాలైన భవనాలు, పలు కట్టడాలు చెదలు పట్టాయి. కొన్ని పనికి రాకుండా పోయాయి. మరికొన్ని మరమ్మతులతో బాగుపడుతున్నాయి. వైఎస్ జగన్ కక్షపూరిత రాజకీయాలకు సాక్ష్యంగా ప్రజావేదిక నిలిచింది. కృష్ణానది లోపలి భాగంలో నిర్మించిన అక్రమ కట్టడాలన్నీ కూల్చి వేస్తానని చెప్పిన నాటి సీఎం జగన్ ప్రజా వేదిక ఒక్కటి కూల్చి ఆ శిధిలాలు కూడా తొలగించకుండా అక్కడే వదిలేశారు. వీటన్నింటినీ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. అధికారులను అడిగి రాజధాని అమరావతి ప్రాంతంలో పరిస్థితులు తెలుసుకున్నారు.
మొదట చంద్రబాబునాయుడు ఇంటిని ఆనుకుని శిధిలంగా ఉన్న ప్రజావేదిక కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం వల్ల ప్రజలకు నష్టం జరిగిందే తప్ప జగన్కు కాదనే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అందుకే చిత్తుచిత్తుగా ఓడిపోయారనే విషయం చెప్పకనే చెప్పారు.