గుంటూరు జీజీహెచ్‌లో పసికందు మాయం

నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Update: 2024-10-07 13:14 GMT

గుంటూరు జీజీహెచ్‌లో పసికందు మాయమైంది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గోరంట్లకు చెందిన నసీమా అనే మహిళ ఆదివారం రాత్రి కాన్పు కోసం గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. అదే రోజు అర్థరాత్రి 1 గంట సమయంలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం వరకు అంతా సవ్యంగానే ఉంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆ మగ శిశువును అపహరించుకుని పోయారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఆ శిశు కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఎవరు కిడ్నాప్‌ చేసి ఉంటారనే దానిపై ఆరా తీస్తుండగా కిడ్నాప్‌ చేసిన శిశువును ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. నలుగురు వ్యక్తులు శిశువును కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


Tags:    

Similar News