గల్లాపెట్టలో గల్లా లేదు

పరుగెత్తి..పరుగెత్తి పని చేయాలని ఉంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..కానీ గల్లా పెట్టె సహకరించడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.;

Update: 2025-02-15 13:17 GMT

గత ఐదేళ్లల్లో ఆదాయం పెరగ లేదు. సంపద పెరగ లేదు. సంపద సృష్టించబడ లేదు. అప్పులు విపరీతంగా చేశారు. గత ఐదేళ్లల్లో రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ ఆప్పులకు వడ్డీలు కట్టాలి. అసలు కట్టాలి. ఇప్పుడు అప్పులోళ్లను చూస్తోంటే భయమేస్తోంది. మొన్నైతే అప్పు కట్ట లేదని మా ఆఫీసుకు టకామని నోటీసులిచ్చారు. డబ్బులు కట్ట లేదు కాబట్టి.. ఆ అప్పులు రికవరీ చేయడానికి ఏమి చేయాలో అది చేస్తామని నోటీసులు ఇచ్చారు. దీని కోసం ఇమ్మిడియట్‌గా అప్పులు చేయాల్సి వచ్చింది. దాంతో అప్పులు కట్టాల్సి వచ్చింది.

అప్పులు కట్టక పోతే ఎవరు అప్పులు ఇవ్వరు. అప్పులు కట్టక పోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేం.. అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. క్రిడిబులిటీ కోసం అప్పులు కడుతున్నాం. అలా విశ్వసనీయత ఉంటేనే తిరిగి అప్పులిస్తారని అన్నారు. పరుగెత్తి..పరుగెత్తి పని చేయాలని ఉంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..కానీ గల్లా పెట్టె సహకరించడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే రూ. 1600 కోట్లతో గుంతలు లేని రోడ్లు చేస్తున్నాం.

రాష్ట్ర వ్యాప్తంగా 85లక్షల మెట్రిక్‌ టన్ను చెత్త పేరుకుని పోయింది. దీనిని తొలగించే బాధ్యతను మున్సిపల్‌ శాఖకు అప్పగించామన్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి నాటికి మొత్తం చెత్తను తొలగించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామని.. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు. దీని గురించి అందరు కలిసి పని చేయాలన్నారు. ఒక రోజు మన ఊరి కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
Tags:    

Similar News