కొంగు బిగించి కలుపు తీసిన కలెక్టరమ్మ!
ఆంధ్రా కలెక్టర్ల రూటే సెపరేటు.. ఒకరు సైకిల్, ఇంకొకరు బడి పంతులు, మరొకరు వ్యవసాయ కూలీ..
ఎవరీ కృతికా శుక్లా..
హర్యానాలో పుట్టి ఆంధ్రప్రదేశ్ లో మట్టివాసన చూసిన ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా. పదవిలో ఉన్నా, మానవత్వాన్ని కోల్పోని, ప్రజల మధ్యే తన స్థానం వెతుక్కున్న ఒక అధికారి. 36 ఏళ్లు. పల్నాడు జిల్లాలో పొలాల్లో కలుపు తీసిన కలెక్టర్గా, మహిళా కూలీలతో చేలో మట్టిలోకి దిగిన పరిపాలకురాలిగా, కృతికా శుక్లా పేరు ఇప్పుడు ప్రజల్లోకి చేరింది.
1989 జనవరి 14న హర్యానాలో జన్మించిన కృతికా శుక్లా విద్యను తన జీవితాధారంగా చేసుకున్నారు. తండ్రి మదన్లాల్ బాత్రా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారవేత్త, తల్లి హర్షా బాత్రా ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్. విద్యా ప్రేరణ ఆ ఇంట్లోనే మొదలైంది. ఆమె శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుండి బి.కాం (హానర్స్), హన్స్రాజ్ కాలేజ్ నుండి ఎం.కాం పూర్తి చేశారు. తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తత్త్వశాస్త్రంలో పీహెచ్డి చేశారు. అకడమిక్ ప్రతిభతో పాటు, సామాజిక దృష్టి, సున్నితమైన ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మద్దతుగా నిలిచాయి.
UPSCలో 103వ ర్యాంక్ – 24 ఏళ్లకే ఐఏఎస్
2012లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 24 ఏళ్ల వయసులోనే ఉత్తీర్ణురాలై దేశంలోని అత్యుత్తమ సేవల్లోకి అడుగుపెట్టారు.
మొదట జమ్మూ–కశ్మీర్ క్యాడర్ కేటాయించారు. తరువాత సహాధికారి **హిమాన్షు శుక్లా (IAS)**ను వివాహం చేసుకున్నాక ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు బదిలీ అయ్యారు. తాను UPSC మార్కుల ప్రకారం 1017 మార్కులతో 103వ ర్యాంక్ సాధించారు.
ఆంధ్రప్రదేశ్లో కృతికా శుక్లా పలు కీలక పదవుల్లో పనిచేశారు. విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా, మదనపల్లెలో సబ్ కలెక్టర్గా, గుంటూరులో జాయింట్ కలెక్టర్గా. తర్వాత మహిళా, బాల సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమ శాఖల్లో సీనియర్ హోదాల్లో సేవలందించారు.
కాకినాడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె “ప్రజా హిత పరిపాలన”కు నిదర్శనంగా నిలిచారు.
తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పని చేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా కలెక్టర్ గా ఉన్నారు