ఊహించినట్టే మండలికి అవనిగడ్డ టికెట్

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్దా ప్రసాద్.. బరిలో దిగనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Update: 2024-04-04 11:21 GMT
Source: Twitter

అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేశారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై నాయకుల అభిప్రాయలను సేకరిస్తున్నారు. రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించినా ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మార్చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశామని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.



Tags:    

Similar News