ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్
నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా కింద కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి అసెంబ్లీలో సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ బలపరిచారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఏపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి నాగబాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తన నామినేషన్ను బలపరిచిన మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లకు ధన్యవాదాలు తెలిపారు.