క్యాడర్‌లో కాన్ఫిరెడన్స్‌ను క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాడర్‌లో కాన్ఫిడెన్స్‌ను క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు.

Update: 2024-02-28 05:31 GMT
AP CM YS Jagan

ఏ నాయకుడైనా క్యాడర్‌లో కాన్ఫిడెన్స్‌ను క్రిచేట్‌ చేడం ద్వారా అడుగులు ముందుకు వేస్తాడు. తాము యుద్ధంలో ఓటమిపాలై పోతున్నామని తెలిసిన వెంటనే నాయకుడు డీలా పడితే యుద్ధం వీగిపోతుంది. సేనలు వెనకడుగు వేస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే. తన సైనికుల వద్ద ఎక్కడా తాము వీగిపోతున్నామని కానీ, వెనుకబడి పోతున్నామని కానీ బాధను, ఆవేదనను సీఎం జగన్‌ వ్యక్తం చేయలేదు. అంటే గెలుపు పోరాటంలో ఓడినా, గెలిచినా తమది పైచేయే అని చెప్పుకోవాలనుకున్నాడు. అందుకే దటీజ్‌ జగన్‌ అనాల్సి వస్తోందంటున్నారు పరిశీలకులు.

మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వై నాట్‌ 175 నినాదంతో బూత్, సచివాలయం స్థాయి కన్వీనర్లకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ శిబిరంలో సీఎం ఉత్తేజభరితమైన ఉపన్యాసం చేశారు. పార్టీ శ్రేణులను కధనరగంలోకి దించేందుకు వీలుగా ఉద్బోధించారు. బూత్‌లెవల్‌ స్థాయి వారితో మాట్లడిన మాటలు వింటే ఎవరైనా నూతనోత్తేజంతో రంగంలోకి దిగుతారు. ‘మేము సిద్ధం.. బూత్‌ సిద్ధం..’ అంటూ రానున్న 45 రోజులు చాలా కీలకమని, గతంలో 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 175 సీట్లు రావాల్సిందేనని ఆయన పేర్కొనడంతో పలురువు ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు నోరెల్లబెట్టారు.

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఏమి మాట్లాడంటే..
బంగారు రుణాలు, రైతు రుణ మాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి.
కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేయము. మనం చెప్పేది చేస్తాం! చేసేదే చెప్తాం.
ఇచ్చిన హామీలు నేరవేర్చకపోగా వారి పార్టీ వెబ్‌సైట్‌లో నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసింది. వారి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు?
కానీ మేము అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాము. ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇప్పుడు, నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి, మేం నేరవేర్చిన మెనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించామనేదాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.
కుప్పంలో మన ప్రభుత్వం ద్వారా 87శాతం కుటుంబాలు ప్రయోజనం పొందాయి.
ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్‌ వార్‌ కాదు, క్లాస్‌ వార్‌.
మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్‌ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పాలి.
వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయకపోతే మన ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని అందరిగి అవగాహన కల్పించాలి.
మన మేనిఫెస్టో మన భగవద్గీత, ఖూరాన్, బైబిల్‌. కానీ టీడీపీకి మాత్రం మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసేదానిగానే చూస్తారు, వాళ్లు పేదల గురించి పట్టించుకోరు.
ఇదంతా నమ్మకానికి సంబంధించింది. జగన్‌ చేస్తానని చెబితే చేస్తాడు! ఆచించిన తర్వాతే జగన్‌ వాగ్దానాలు చేస్తారు. చంద్రబాబు మాత్రం కాదు.
మన వ్యవస్థే మనకు అత్యంత ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరు తమ బూత్‌ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్‌ చేయండి.
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌ గా తీసుకోండి. ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. ఈ వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడంతోపాటు వారిని పర్యవేక్షించగలగాలి.
అయితే మీరందరూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి కాల్స్‌ వచ్చినా, మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలవండి
వాలంటీర్లు, గృహ సారథిలతో సమన్వయపరచుకుంటు వారితో కలిపి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి. ప్రతి బూత్‌ బృందంలో 15 నుంచి 18 మంది బూత్‌ సభ్యులు ఉంటారు.
మా ప్రభుత్వానికి ఘనమైన రికార్డు ఉంది. మనం గొప్పగా పని చేశాం. ఇప్పుడు మన దృష్టి కేవలం మన నూతన వ్యవస్థ పై మాత్రమే పెట్టాలి. మనం మంచి చేశమనే తృప్తితో ప్రజల వద్దకు వెళ్లండి.
మనం అందరికీ మంచి చేసినట్లయితే, పూర్తి మెజారిటీతో ఎందుకు గెలవలేము!. ఆ మెజారిటీ కుప్పం నుంచే ప్రారంభం కావాలి.
నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు! మీరందరూ గెలవాలని నేను కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాం, దాదాపు ఇవే ఫైనల్, టికెట్ల గురించి మీరు ఆలోంచిక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా లబ్ది పోందిన ప్రతి గడపకు వెళ్లి మనం చేసిన మంచిని ఒట్లుగా మార్చుకోవటమే.
పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లండి. పేదలకు మంచి చేశామని, ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పండి. మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండి. ఆల్‌ ది బెస్ట్‌.
Tags:    

Similar News