High alert Zones | ఆధ్యాత్మిక నగరాలపై నిఘా సంస్థల డేగ కన్ను
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను హై అలర్ట్ జోన్లుగా గుర్తించారు. స్లీపర్ సెల్స్ కలకలం సృష్టించిన పట్టణాల్లో నిఘా సంస్థలు డేగకన్నుతో దృష్టి సారించాయి.;
పహల్ గావ్ మారణకాండ నేపథ్యంలో దేశంలో భద్రతా బలగాలను అప్రమత్తం అప్రమత్తం చేశారు. రక్షణ దళాలతో పాటు సివిల్ పోలీసులు, ప్రధానంగా నిఘావర్గాలు కూడా అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.
ప్రస్తుతం ఈ ప్రాంతం అన్నమయ్య జిల్లా పరిధిలో ఉంది. దీంతో అన్నమయ్య జిల్లా ఇన్ చార్జి ఎస్పీ ఈజీ. అశోెక్ కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి సారధ్యంలో ముమ్మరంగా తనిఖీలు సాగించారు.
చురుగ్గా తనిఖీలు
తిరుమలలో తనిఖీ చేస్తున్న పోలీసులు
తిరుపతి అలిపిరి చెక్ పోస్టుతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్, పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి కూడా తనిఖీలు ఏకకాలంలో సాగించారు.
గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో చిత్తూరు ప్రాంతం షెల్టర్ జోన్ గా మార్చుకుని, తీవ్రవాదులు స్లీపర్ సెల్స్ గా మారినట్లు ఆ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన తిరుమలతో పాటు జిల్లాలోని ప్రధాన ఆలయాలకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలోనే 2004 లో
మొదట ఎస్పీఎఫ్, బలగాలను రంగంలోకి దించారు. కేంద్ర నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఆ తరువాత కొన్నేళ్లకు అక్టోపస్ కమాండోలు కూడా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తిరుమలలో మకాం వేశారు.