"ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించని స్ధితిలో ప్రతి సంవత్సరం ఈ కష్టం వృధా అవుతోంది. బాధలు కూడా తప్పడం లేదు. అప్పులు మిగులుతున్నాయి" అనే వేదన వ్యక్తం చేశారు. కన్నబిడ్డల్లా పెంచిన మామిడి చెట్లను నిట్టనిలువునా నరికి వేశారు. ఈ దృశ్యాలు రోడ్డున వెళ్లే వారిని కూడా వేదనకు గురి చేస్తున్నాయి. తోటల యజమానులైన రైతులు మండతున్న గుండెలతో గుడ్ల నీరు కక్కుకుంటున్నారు.
ఉపాధి హామీ పుణ్యమా అని..
తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలంలో 30 ఏళ్ల కిందటి వరకు వెయ్యి ఎకరాల్లో మాత్రమే మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఉపాధిహామీ పథకం పుణ్యమా అని అన్ని సామాజిక వర్గాల వారికి అదృష్టం కలిసొచ్చింది. వంద శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ తోటల సంఖ్య దాదాపు ఐదు వేల ఎకరాల వరకు పెరిగినట్లు ఉద్యానవన శాఖాధికారుల కథనం.
అప్పుల కుప్ప..
ఈ ఏడాది దిగుబడి గణనీయంగా పెరిగింది. కిలో మామిదికి ప్రభుత్వం 12 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అందులో ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తే, గుజ్జ పరిశ్రమల ద్వారా 8 రూపాయలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల యజమానులు ఏర్పాటు చేసుకున్న ర్యాంపుల వద్ద మామిడి కాయలు కొనుగోలు చేసే వ్యాపారులు కిలోకు కనీసం మూడు రూపాయలు కూడా ఇవ్వని స్థితిలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎకరా విస్తీర్ణంలో తోటలకు సస్యరక్షణ, కోత, రవాణా ఖర్చులు కలిపితే టన్నుకు నుంచి ఏనిమిది వేల వకరకు ఖర్చ వస్తుంది. గుజ్జ పరిశ్రమల వద్దకు వెళితే, అందులో సగం ధర కూడా గిట్టుబాటు కాని స్థితిలో రైతులు వేదనకు గురవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరవకపోవడం ఒక కారణమైతే. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు కూడా సామర్ధ్యానికి తగినట్లు పనిచేయకపోవడం. బహిరంగ మార్కెట్ లో కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు ఉంటే, ఎనిమిది ఎలా చెల్లించగలం? కొన్ని పరిశ్రమల వద్దకు టోకెన్లు లేకున్నా, మామిడికాయల లోడుతో వెళ్లిన ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. ఈ ఏడాది మామిడి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తి కథనం
On The Federal Andhra Pradesh YouTube ఛానల్ లో చూడండి
Full View