చెక్ పోస్ట్‌ల రద్దు కారణాలు చెప్పిన పొన్నం ప్రభాకర్..

రవాణా శాఖలో పారదర్శకత, బ్రోకర్ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.

Update: 2025-10-22 11:52 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్ట్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. బలమైన కారణాల వల్లే చెక్‌పోస్ట్‌లను రద్దు చేశామన్నారు. ఈ నిర్ణయం రవాణా వ్యవస్థలో నూతన దశకు నాంది పలకనుందననారు. ‘‘తెలంగాణ లో చెక్కు పోస్టులు రద్దు ఈరోజు నుండి అమలు చేస్తూ జీవో జారీ చేశాం. చెక్కు పోస్టుల రద్దు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించడానికి , ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో జరగడానికి చెక్కు పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకొని ఈరోజు చెక్కు పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నాం. తెలంగాణ లో ఈవి పాలసీ తీసుకొచ్చిన తర్వాత 577 కోట్ల టాక్స్ ప్రభుత్వం మినహాయించింది’’ అని తెలిపారు.

‘‘ఈవీ వెహికిల్ అమ్మకాల షేర్ నుండి 0.03 నుండి 1.13 షేర్ పెరిగింది. ఢిల్లీలో పొల్యూషన్ లో ఉండే పరిస్థితి లేదు.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఇవి పాలసీ తీసుకొచ్చాం. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చాం.. LPG, CNG ఆటో లకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చాం. 25 వేల రేటిరోఫిటింగ్ ఆటో లకు అనుమతి ఇచ్చాం. రాష్ట్రంలో వాహన్ అమలవుతుంది..సారథి త్వరలోనే తీసుకొస్తాం. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చాం.. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చాం. AI టెక్నాలజీ ను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుంది..అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నాం. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు. రోడ్ సేఫ్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నాం.. నాచారం లో గవర్నర్ ప్రారంభించారు.. కరీంనగర్ లో ప్రారంభించుకున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. టూరిజం వెహికల్స్ కి డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నాం. రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

‘‘కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. దాని అమలు పై మెడికల్ , పోలీస్, నేషనల్ హైవేస్ తో సమీక్షా సమావేశం జరిగింది. రవాణా శాఖ రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్మెంట్.. 112 మంది AMVI లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నాం. నలుగురు ఆర్టీవో లను గ్రూప్ 1 ద్వారా వచ్చారు. రవాణా శాఖ కు ఒక లోగో తీసుకొచ్చాం తెలంగాణ పోలీస్ ,ఫారెస్ట్ మాదిరి లోగో తీసుకున్నాం. TS ను TG గా మార్చాం. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇల్లీగల్ , ఓవర్ లోడింగ్ ఎన్ఫోర్స్ మెంట్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నాం. చెక్కు పోస్టులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలకు చేప్తున్నాం’’ అని అన్నారు.

‘‘రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయి.. వాటన్నిటిని రోడ్ ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పాత వాహనాలు డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్,ఇతర వాహనాలకు మొదటగా చూస్తున్నాం. రవాణా శాఖ లోని 63 కేంద్రాల్లో కెమెరా ల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది.. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖ ,ఆర్టీసీ ఇతర విభాగాలలో పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలని లేఖ రాశాం.. చెక్కు పోస్టులను రద్దు చేయాలని నేనే ముఖ్యమంత్రి గారి దృష్టికీ తీసుకుపోయి కేబినెట్ లో పెట్టడం జరిగింది’’ అని చెప్పారు.

‘‘వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల్లో పాపాల పుట్ట లాగ అవినీతి జరిగింది.. వాహన్ సారథి లో 28 రాష్ట్రాలు ఉన్నాయి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదు.. ఇప్పుడు మేము వాహన్ సారథి లో చేరాం.. డేటా ట్రాన్ఫర్మింగ్ జరుగుతుంది.. వాహన్ అమలు చేస్తున్నాం.. సారథి అమలు చేస్తాం.. చెక్కు పోస్టులు రద్దు చేసిన వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా చేస్తాం’’ అని వివరించారు.

Tags:    

Similar News