Ponnam Prabhakar | ‘ఎర్ర చొక్కా వేసుకుంటే నక్సలైట్ అయిపోతారా?’
కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ తోసిపుచ్చారు. ప్రభుత్వ సంక్షేమం చూసి తట్టుకోలేకే నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.;
కుల గణనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ తోసిపుచ్చారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం చూసి తట్టుకోలేకే వారు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో ఆయన కుల గణన అంశంపై స్పందించారు. దేశంలోనే మార్గదర్శకంగా కుల గణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ‘‘ఎవరి లెక్క ఎంతో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పారు. రాంగ్ డైరెక్షన్ లో పోయేలా బిజేపి బిఆర్ఎస్ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నారు. ఆ రెండు పార్టీలకు కుల గణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తు అపిడపిట్ ధాఖలు చేసింది’’ అని వెల్లడించారు.
‘‘మొన్నటి సర్వేలో పాల్గొనని వారు కేసిఆర్ కేటీఆర్ హరీష్ రావు కు ఫామ్ లు పంపుతున్నాం. ప్రణాళిక సంఘం ఆద్వర్యంలో కులగణన సర్వే చేశాం. ఇప్పుడైనా మీ వివరాలు ఇవ్వండి...అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత హక్కు లేదు. బిజేపి కి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండి. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. బిసిలకు న్యాయం చేసేలా కృషి చేస్తున్నాం. మేదావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం’’ అని తెలిపారు.
‘‘ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలలో ముస్లీం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తతి కాదు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దు. ఎర్ర చొక్కా వెసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను నిన్న నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నా. అంతమాత్రాన నేను నక్సలైట్ ను అవుతానా?’’ అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.