పారిస్ ఒలంపిక్స్ లో ఖాతా తెరిచిన భారత్.. ఏ విభాగంలో మెడల్..

పారిస్ లో జరగుతున్న 33 ఒలంపిక్స్ క్రీడా సంగ్రామంలో భారత్ ఆదివారం ఖాతా తెరిచింది. షూటింగ్ విభాగంలో మనుభాకర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్వర్ణ, రజత పతకాలు..

Update: 2024-07-28 11:39 GMT

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఖాతా తెరిచింది. ఈ సారి డబుల్ డిజిట్ స్థాయిలో పతకాలను సాధించాలనే లక్ష్యంతో ఫ్రాన్సు వెళ్లిన మన క్రీడాకారులు పతకాల వేట మొదలు పెట్టారు. ఆదివారం షూటర్ మనుభాకర్ భారత్ కు తొలి పతకాన్ని అందించారు.

22 ఏళ్ల భాకర్ ఫ్రాన్స్‌లోని చాటౌరోక్స్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఈవెంట్ లో భారత్ గత మూడు ఒలంపిక్స్ నుంచి పతకం గెలవట్లేదు. ఎట్టకేలకు 12 సంవత్సరాల తరువాత భారత్ ఖాతాలో ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పతకం గెలవడానికి ఫైనల్ రౌండ్ లో మను భాకర్ 221.7 స్కోర్ సాధించాడు. దీంతో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ కూడా మను నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్‌కు ఆమె అర్హత సాధించింది.
కొరియన్లు బంగారం, వెండి..
ఈ విభాగంలో కొరియన్లు స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నారు. కిమ్ యెజీ 241.3తో రజతం సాధించగా, ఇదే దేశానికి చెందిన జిన్ యే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. చివరిసారిగా 2012 లండన్ ఎడిషన్ ఒలింపిక్స్‌లో భారత్ ఈ విభాగంలో పతకాలు గెలుచుకుంది, ర్యాపిడ్-ఫైర్ పిస్టల్ షూటర్ విజయ్ కుమార్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మార్క్స్‌మెన్ గగన్ నారంగ్ కాంస్యం సాధించారు. నారంగ్ ఇప్పుడు పారిస్‌లో భారత్ చెఫ్ డి మిషన్.
మను భాకర్ మాటల్లో..
పతక విజయం తర్వాత, భాకర్ మాట్లాడుతూ, "నేను గొప్పగా భావిస్తున్నాను. ఇది దేశానికి చాలా కాలం తరువాత లభించిన పతకం. నేను దీన్నిసాధించాలనే ఉత్సాహం, సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. దేశం మరిన్ని పతకాలు గెలవడానికి అర్హమైనది. నేను మంచి పని చేసాను, ఇది కాంస్యం... తదుపరిసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాను. బహుశా అది మొదటి స్థానం కావచ్చు. (ఒకటి).
" నేను భగవద్గీత చాలాసార్లు చదివాను. నేను చేయవలసింది నేను చేస్తాను, విధి మీరు నియంత్రించలేనిది.. అని పరమాత్మ శ్రీకృష్ణుడు చెప్పినట్లు, " ఫలితంపై కర్మ ఆధారపడి లేదు, కర్మపై దృష్టి పెట్టండి." అదే నేను చేసాను. .. నేను అనుకున్నాను, 'మీ పని చేయండి. అన్నీ ఉండనివ్వండి. "టోక్యో (ఒలింపిక్స్) తర్వాత నేను చాలా నిరాశకు గురయ్యాను... నేను బలంగా తిరిగి వచ్చాను. గతం గతంలోనే ఉంటుంది." అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ అభినందనలు..

చారిత్రాత్మక పతకం సాధించినందుకు భాకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో అభినందించారు. ఈ ఘనత "అద్భుతమైనది" అని కొనియాడారు.
"భారతదేశం తరపున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా ఈ విజయం మరింత ప్రత్యేకమైనది" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Tags:    

Similar News