
ఎకనామిక్ సర్వే సంకేతాలు: 7 శాతం వృద్ధిపై ఆశలు
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. అంచనాలు, సవాళ్లు ..
ఫిబ్రవరి 1… ఆదివారం… దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం. యూనియన్ బడ్జెట్ 2026తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త చరిత్రకు సిద్ధమయ్యారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా, ఆదివారం రోజున బడ్జెట్ చదివే తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు. ఇదే తాజా అప్డేట్గా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కాలక్రమంలో మారింది. 1999 వరకు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ చదివే పద్ధతి ఉండేది. అదే ఏడాది యశ్వంత్ సిన్హా ఉదయం పదకొండు గంటలకు మార్చారు. ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి చివరి నుంచి ఫిబ్రవరి 1కి ముందుకు తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ ఇప్పటికే 2020, 2025లో శనివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి ఆదివారం మరో మైలురాయి చేరనుంది.
యూనియన్ బడ్జెట్ 2026 కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలను వెల్లడించనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ఇది కీలక పునాదిగా భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాలు సవాళ్లుగా మారాయి.
ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతం కంటే దిగువకు తీసుకెళ్లాలన్న లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బడ్జెట్లలో మౌలిక వసతులపై ఖర్చు పెరగగా, అదే ఊపు కొనసాగుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
బడ్జెట్కు ముందు పరిశ్రమ వర్గాలు తమ అంచనాలు వెల్లడించాయి. మౌలిక వసతులు, తయారీ రంగంపై పెట్టుబడులు కొనసాగించాలని సూచించాయి. టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్ అంశాల్లో స్పష్టత కోరుతున్నాయి.
ఎకనామిక్ సర్వే అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు సాధారణంగా కొనసాగనున్నాయి. పన్నుల విధానం, రంగాల వారీ కేటాయింపులపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, యూనియన్ బడ్జెట్ 2026 దేశ ఆర్థిక ప్రయాణంలో మరో కీలక మలుపుగా నిలవనుంది.
Live Updates
- 1 Feb 2026 11:25 AM IST
సిటి ఎకనమిక్ రీజియన్స్ పథకం
సిటి ఎకనమిక్ రీజియన్స్ ఏర్పాటుచేస్తారు. టెంపుల్ సిటిస్, టియర్ 2, టియర్ 3 సిటీలో వీటిని ఏర్పాటుచేస్తారు.
- 1 Feb 2026 11:25 AM IST
రూ.12.2 లక్షల కోట్లకు చేరిన క్యాపెక్స్
ఆర్థిక సంవత్సరం 2027కు భారతదేశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.12.2 లక్షల కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
దీంతో పాటు ఎస్ఎంఈ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10వేల కోట్ల నిధులను వెల్లడించింది. తద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు.
- 1 Feb 2026 11:22 AM IST
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ప్రారంభం
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ప్రారంభం
- 1 Feb 2026 11:21 AM IST
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి నిలకడగా కొనసాగించడం అనే తొలి కర్తవ్యంపై మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరు ప్రధాన రంగాల్లో జోక్యం చేపట్టాలని ప్రతిపాదించారు.
- మొదటిగా, ఏడు వ్యూహాత్మక, భవిష్యత్ రంగాల్లో తయారీ రంగాన్ని విస్తరించాలని సూచించారు.
- రెండవది, పాత పారిశ్రామిక రంగాలను పునరుజ్జీవింపజేయాలని పేర్కొన్నారు.
- మూడవది, బలమైన ఎంఎస్ఎంఈలను ‘చాంపియన్’ స్థాయికి తీసుకెళ్లాలని ప్రతిపాదించారు.
- నాలుగవది, మౌలిక సదుపాయాలకు శక్తివంతమైన ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు.
- ఐదవది, దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
- ఆరవది, నగర-ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
- 1 Feb 2026 11:20 AM IST
ఉద్యోగాల సృష్టి దిశగా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపట్టిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సంస్కరణలతో “రిఫార్మ్ ఎక్స్ప్రెస్” మంచి వేగంతో ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.
- 1 Feb 2026 11:20 AM IST
మూడు కర్తవ్యాలను నెరవేర్చేందుకు సహాయక ఎకోసిస్టం అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ మూడు దిశల విధానాన్ని అమలు చేయాలంటే నిర్మాణాత్మక సంస్కరణల వేగాన్ని కొనసాగించడం, బలమైన స్థిరమైన ఆర్థిక రంగాన్ని నిర్మించడం, కృత్రిమ మేధ (AI) అనువర్తనాలు సహా ఆధునిక సాంకేతికతలను వినియోగించడం కీలకమని ఆమె పేర్కొన్నారు.
- 1 Feb 2026 11:20 AM IST
యూనియన్ బడ్జెట్ 2026-27 యువశక్తి ఆధారంగా రూపొందిన ప్రత్యేక బడ్జెట్ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం పేదలు, వెనుకబడినవారు, నిరుపేద వర్గాలపై దృష్టి పెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.
ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం మూడు కర్తవ్యాల నుంచి ప్రేరణ పొందిందని చెప్పారు.
మొదటి కర్తవ్యం ఉత్పాదకత, పోటీ సామర్థ్యాన్ని పెంచుతూ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ స్థాయి అనిశ్చిత పరిస్థితులకు తట్టుకునే బలాన్ని నిర్మించడం అని తెలిపారు.
రెండో కర్తవ్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత సమృద్ధి మార్గంలో వారిని భాగస్వాములుగా తీర్చిదిద్దడం అని పేర్కొన్నారు.
మూడో కర్తవ్యం ప్రతి కుటుంబం, రంగం, ప్రాంతానికి అవసరమైన వనరులు, సౌకర్యాలు, అవకాశాలు అందుబాటులో ఉండేలా చూడడం, ప్రజల అర్థవంతమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
- 1 Feb 2026 11:20 AM IST
ప్రభుత్వం “ఆత్మనిర్భర్త”ను మార్గదర్శక నక్షత్రంగా తీసుకుని ముందుకు సాగుతున్నందువల్ల దేశం 7 శాతం ఉన్నత వృద్ధిరేటును సాధించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో వాణిజ్యం, బహుపక్ష వ్యవస్థలు అత్యంత కీలకంగా మారాయని ఆమె పేర్కొన్నారు. వనరుల లభ్యత, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్ ప్రపంచ మార్కెట్లతో బలమైన అనుసంధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భారత్ మరింత ఎగుమతులు పెంచుతూ స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించాల్సిందిగా ఆమె స్పష్టం చేశారు.
- 1 Feb 2026 11:17 AM IST
కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ కోసం రు. 10 వేలు కోట్లు
నేషనల్ హ్యాండ్ లూమ్, హాండిక్రాఫ్ట్స కోసం ప్రత్యేక్ కార్యక్రమం
మెగా టెక్స్ టైల్ పార్క్స్ , మహాాత్మ గ్రామ్ స్వరాజ్ పథకం ప్రారంభం
చేనేత, ఒక జిల్లా ఒక ఉత్పత్తు లకు దీని వల్ల మేలు జరుగుతుంది.
- 1 Feb 2026 11:16 AM IST
బయో ఫార్మా స్ట్రాటజీని ప్రతిపాదించిన నిర్మలా
ఆరోగ్య రంగంలో జ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న BioPharma Strategy for Health Advancement through Knowledge, Technology and Innovation భారతదేశ ఆరోగ్య రంగంలోని డిజిటల్ ఎకోసిస్టంను మరింత బలోపేతం చేస్తుందని ఆమె బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

