‘ఆగస్టులో మోదీ సర్కారు కూలిపోతుంది’

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందా? ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ వ్యాఖ్యలు నిజమవుతాయా?

Update: 2024-07-05 12:38 GMT

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే నెలలోగా పడిపోవచ్చని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. జనతాదళ్‌ను చీల్చి బీజేపీ స్థాపించి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అస్వస్థతతో బాధపడుతున్న 70 ఏళ్ల లాలూ.. “మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. అది ఎప్పుడైనా పడిపోవచ్చు. ఆగస్టులో పడవచ్చు.” అని అన్నారు.

ఐదేళ్ల క్రితంతో పోల్చితే.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌జేడీ తన ఓటు శాతాన్ని మెరుగుపరుచుకుందని, ఎలాంటి పరిస్థితులనయినా ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు.

“బీహార్ అసెంబ్లీలో మేం కొంత కాలం అతి పెద్ద పార్టీగా ఉన్నాం. ఇతర నాయకుల్లాగా.. మేం ఎప్పుడూ భావజాలంతో రాజీపడలేదు” అని ప్రసాద్ అన్నారు.

Tags:    

Similar News