మోదీ 3.0 పాలనకు అతిపెద్ద సవాలేంటో తెలుసా?
వ్యక్తుల మధ్య స్నేహం దేశ సంబంధాలను ప్రభావితం చేయదని నిరూపించిన ట్రంప్;
By : The Federal
Update: 2025-06-10 07:16 GMT
వివేక్ కట్జూ
భారత ప్రధానిగా మోదీ మూడోసారి జూన్ 9, 2024న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2014, 2019 లో లాగా ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. ఈ విషయం ప్రపంచం గ్రహించింది.
సంపూర్ణ మెజారిటీ లేకపోవడం వలన ఈ సారి పాలనలో దేశీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని భావించారు. కానీ ఆయన ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న విదేశాంగ విధానం మాత్రం మారదని అది గ్రహించి ఉంటే బాగుండేది. విదేశాంగ విధానానికి బాహ్య వాతావరణం అవసరం లేనందున తన విధానాలను సవరించాల్సిన అవసరం కూడా మోదీ 3.0 పాలనలో జరగలేదు.
బైడెన్ యుగంలో ఏం జరిగింది..
జనవరి 2021 లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వాతావరణ సమస్యలు సహ మానవాళి ఎదుర్కొంటున్న అస్తిత్వ సంక్షోభాలపై తనదైన శైలిలో మార్గాలను అనుసరించి ప్రపంచ వాతావరణాన్ని తేలికపరిచారు.
బైడెన్ పాలనాకాలంలో మోదీ ప్రపంచవ్యాప్తంగా భారత ప్రయోజనాలకు అనుగుణంగా ఓ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించి అమలు చేయగలిగారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించింది.
సూత్రపాయంగా సైనిక చర్య ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్ ఇతర కూటములు చేసిన విమర్శలను భారత్ గణాంకాలతో సహ తిప్పికొట్టింది. ముఖ్యంగా చమురు కొనుగోలు, రష్యాతో దాని నిరంతర లావాదేవీలను సమర్థించుకుంది.
హమాస్ దాడి విషయంలో ఇజ్రాయెల్ పై సానుభూతి చూపింది. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాతో సంబంధాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉంది. భారత్- అమెరికా సంబంధాల విస్తరణకు అమెరికాలో కూడా ద్వైపాక్షిక మద్దతు సాధించింది.
ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని చురుకుగా ప్రొత్సహించే గురు పత్వంత్ సింగ్ పన్నూన్ ను హత్య చేయడానికి భారత నిఘా సంస్థలు కుట్ర పన్నాయని సూచిస్తూ అమెరికా ఆరోపణలు చేసింది.
అయితే నవంబర్ 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ కేసుపై రెండు దేశాలు ఒక విధాన నిర్ణయానికి వచ్చాయని స్పష్టమైంది. భారత్ లో కూడా కేసు నమోదైన ‘రా’ అధికారి వికాస్ యాదవ్ నిఘా రాడార్ నుంచి బయటపడ్డాడు.
మెరుగుపడిన భారత్- కెనడా సంబంధాలు..
చైనా మహమ్మారి సంవత్సరాల తరువాత అంతర్జాతీయ సమాజం ప్రాధాన్యత ఆర్థికాభివృద్దిగా మారింది. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందడానికి భారత్ మంచి స్థానంలో ఉంది. భారత్ చేస్తున్న రాజకీయాలు ఏ దిశలో వెళ్తున్నాయనేది ప్రపంచానికి ఇంకా అర్థం కాలేదు.
అయితే కెనడాతో సంబంధాలు మాత్రం కొత్త స్థాయికి చేరుకున్నాయి. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లు కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ విశ్వసనీయ నిఘా సంస్థ సమాచారం ఆధారాలు దాని దగ్గర లేదు.
కెనడా ప్రధాని మార్పుతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. సిక్కు ఓట్లు లేకుండా పీఠమెక్కిన కొత్త ప్రధాని మార్క్ కార్నీ పాత ప్రధానుల మార్గాన్ని మార్చుకున్నారు.
ఆయన మోదీని జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించారు. మోదీ 3.0 లో కూడా భారత్ ఇండో - పసిఫిక్, ఆఫ్రికా, దక్షిణా అమెరికా లోని దేశాలకు చేరువైంది. అలాగే భారతీయ డయాస్పోరాను ఆశ్రయించడం కూడా జరిగింది. సంఘ్ పరివార్ ఎజెండాకు అనుగుణంగా దాని శక్తిని ప్రదర్శించడానికి భారతీయ సంప్రదాయాలపై ప్రాధాన్యత ఇచ్చింది.
మోదీ 3.0 పాలనలో తొలి సంవత్సరంలో భారత విధాన నిర్ణేతలకు తీవ్ర ఆందోళన కలిగించిన ప్రాంతం ఏదైనా ఉందంటే.. అది బంగ్లాదేశ్ విషయమే. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆగష్టు 5న 2024న ఢాకా నుంచి పారిపోయి ఢిల్లీ చేరుకుంది. తరువాత ఆ దేశంతో సంబంధాలు అధమస్థాయికి చేరుకుంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల మధ్య హసీనా ఢాకాలో కొనసాగడం కష్టమైంది. దీనితో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లా కేంద్రమైంది. భారత్ కు ఇప్పటికే పశ్చిమాన ఉన్న పాకిస్తాన్ తో ఘర్షణలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు వైపు కూడా మొదలయింది.
తాలిబన్ల ప్రయత్నాలకు ప్రతిస్పందించడంలో భారత్ ఆలస్యంగా ఉంది కానీ నెలలు గడిచేకొద్ది అది స్పందించింది. ఇప్పటికే ఉత్తర పార్శ్వం కూడా అలాగే ఉంది. దక్షిణాన ఉన్న దేశాలు కూడా అదే దారిలో ఉన్నాయి.
2020 లో గల్వాన్ ఘర్షణతో చైనాతో సంబంధాలు చెడిపోయాయి. ఇవి ఒకానొక స్థాయిలో యుద్ధం వరకూ వెళ్లాయి. అయితే 2024 అక్టోబర్ లో రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్బంగా మోదీ- షీ జిన్ పింగ్ తో సమావేశం అయ్యాక కొంతవరకూ మారాయి. అయితే గల్వాన్ సంఘటనకు ముందు ఉన్న స్థితి పూర్తిగా సెట్ కాలేదు.
అంతేకాకుండా ఎల్ఏసీ వెంబడి శాంతి, ప్రశాంతతపై 1990 ల ఒప్పందాలకు తిరిగి రావడం సాధ్యం కాదు. కాబట్టి కొత్త సమతుల్యతను సాధించాల్సి వచ్చింది. కాబట్టి కొత్త సమతుల్యతను సాధించాల్సి వచ్చింది.
దీనితో భారత్ కచ్చితంగా పాశ్చాత్య కక్ష్యలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. చైనాతో నిరంతరం సంఘర్షణలు కారణంగా ఇది జరుగుతూ ఉంది.
ట్రంప్ ను ఆకర్షించడానికి మోదీ ప్రయత్నం..
2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది. ఈ తలనొప్పును ప్రపంచంతో సహ భారత్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను సంకెళ్లలో స్వదేశానానికి తీసుకురావడంలో దేశంలో తక్షణ ప్రభావం కనిపించింది.
సహజంగానే ఈ పరిణామం దేశంలో ఆగ్రహాన్ని తీసుకొచ్చింది. ట్రంప్ భారత్ ను పదేపదే సుంకాల రాజుగా పిలిచారు. భారత్ తమ వస్తువులపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తుందో, అదే స్థాయిలో తాము భారత వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అలాగే అమెరికా కంపెనీలు భారత్ లో కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి వీలులేదని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
భారత్ ఏం చేస్తుంది..
మోదీ తనదైన శైలిలో ట్రంప్ ను ఆకర్షించడానికి ప్రయత్నించారు. విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఆయన ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. తరువాత ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించారు.
ఓవల్ కార్యాలయాన్ని సందర్శించిన మొదటి వ్యకులలో ఆయన ఒకరయ్యారు. అయితే మోదీ అమెరికాలో ఉండగానే భారత్ పై సుంకాలు విధింపును ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులకు భారత్ లో తలుపులు తెరవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
క్వాడ్ శిఖరాగ్ర సమావేశం..
ఆపరేషన్ సిందూర్ సమయంలో తరువాత భారత్, మోదీ పట్ల ట్రంప్ తన నిజస్వరూపాన్ని చూపించారు. తాను అణు యుద్దాన్ని నివారించడానికి ట్రంప్ పదేపదే ప్రకటిచుకుంటున్నారు.
అయితే ఈ ప్రకటలను భారత్ తిరస్కరించింది. తాను మధ్యవర్తిత్వం వహించి, వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నామని ఆయన చెప్పారు. అందుకే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇండో యూఎస్ సంభాషణలో వాణిజ్యం అసలు ప్రస్తావనకే రాలేదని భారత్ తెలిపింది. ట్రంప్ 2.0 సమానంగా భారత్- పాకిస్తాన్ లను వాస్తవంగా సమానంగా చూస్తోంది.
అంతర్ రాష్ట్ర సంబంధాలలో వ్యక్తిగత సంబంధాలకు ప్రాముఖ్యత లేదని ట్రంప్ నిరూపించారు. సెప్టెంబర్ లో భారత్ లో క్వాడ్ సమావేశం జరగబోతోంది. దీనికి ట్రంప్ వస్తారా లేక తన డిప్యూటీ వాన్స్ ను పంపుతారా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉగ్రవాద సవాల్
భారత్ ఇప్పటికే యూరప్ ప్రాధాన్యతను గుర్తించింది కానీ, దానితో వాణిజ్య ఒప్పందం కుదరడం మాత్రం చాలా కష్టమైన పనిలా ఉంది. భద్రతా రంగంలో వాటితో మనం ఎంత దూరం వెళ్తామో సరిగా తెలియదు.
మార్చి 11న బలూచిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసి తరువాత ఏప్రిల్ 22న పహల్గామ్ లో అమాయక హిందూ పర్యాటకులు మతం అడిగి, ప్యాంటు విప్పి చూసి మరీ కాల్చి చంపారు.
దీనికి భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడులపై దేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని సైతం అఖిలపక్ష ప్రతినిధులు సైతం ప్రపంచానికి చూపించారు. అయితే అణ్వాయుధ దేశాల మధ్య శత్రుత్వాలు పెరగకుండా ప్రపంచం ఎక్కువగా దృష్టి సారిస్తోంది.
మోదీ 3.0 పాలన మొదటి సంవత్సరం ముగియనున్న తరుణంలో పాకిస్తాన్ చేయిస్తున్న ఉగ్రవాద దాడి అసలైన సవాల్ అని ప్రపంచానికి అర్థమయ్యేలా చూడటం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. అందువల్ల ప్రపంచంలోని ప్రధాన శక్తులు పాకి ఉగ్రవాదంపై ఆధారపడకుండా చేయాలి. అయితే ఇది అంతర్జాతీయ ప్రాధాన్యత అంశం కానందున ఇది అంతసులభంగా పరిష్కారం కాదనిపిస్తోంది.