విదేశాంగ విధానంలో మోదీ అడుగులు తడబడుతున్నాయా?

దశాబ్దకాలంగా మోదీ విదేశాంగ విధానంపై అనేక ప్రశంసలు పొందారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని పర్యటనలు వివాదాస్పదం అయ్యాయి.

Update: 2024-09-01 05:57 GMT

కొన్నిరోజులుగా భారత విదేశాంగ విధానంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ప్రధాని అత్యంత విశ్వాసంతో ఉన్న ఈ రంగంలో నరేంద్ర మోదీ తడబడుతున్నారా? అని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ విదేశాంగ విధానంపై అత్యధిక ప్రశంసలు, ప్రచారం పొందారు. విదేశాలలో జరిగిన ఆయన సమావేశాలకు భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున హాజరు కావడం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని నాయకులను కూడా ఆకట్టుకుంది.
ప్రపంచ మందగమనం మధ్య భారత్ ఆర్థిక వృద్ధి, ఇదే సమయంలో వూహాన్ వైరస్ అనంతర ప్రపంచంలో గ్లోబల్ గ్రోత్ ఇంజన్ గా ప్రశంసలు పొందిన చైనా ఆర్ధిక వ్యవస్థలో స్తబ్దత ఏర్పడింది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంతో ముందుకు సాగడంతో గ్లోబల్ గ్రోత్ ఇంజన్ గా ఇండియా పేరు మారు మోగిపోయింది. ప్రపంచంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఇమేజ్ ను మోదీ ప్రదర్శించగలిగారు.
షైన్ ఆఫ్ అవుతుందా?
ఇన్నాళ్లు కనిపించిన ఆ మెరుపులు తగ్గుముఖం పడుతున్నాయా? అని దౌత్యవేత్తలు ఆశ్చర్యపడుతున్నారు. "మొదటిసారి, మోదీ విదేశాంగ విధానాన్ని స్కానర్ కింద పరిశీలించాల్సిన అవసరం వచ్చింది " అని ఒక పరిశీలకుడు చెప్పారు.
అమెరికా గడ్డపై సిక్కు తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కిరాయికి హత్యాయత్నం కుట్రలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించిన కారణంగా, భారతదేశం-యుఎస్ సంబంధాలలో తొలిసారి తొట్రుపాటు కనిపించింది. దీనితో భారత్ కు తొలి దెబ్బ తగిలింది.
ద్వంద్వ ఆరోపణలతో..
ఇంతకుముందు కెనడాలో ఉంటున్న మరో సిక్కు తీవ్రవాదీ హర్డిప్ సింగ్ నిజ్జార్ ను హత్య చేయడంలో భారత్ ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు. తరువాత అమెరికా ఇదే తరహా ఆరోపణలు చేసి కోర్టులో కేసు దాఖలు చేసింది. అయితే కెనడా ఆరోపణలను ఖండించిన భారత్.. అమెరికా ఆరోపణలపై మాత్రం దర్యాప్తుకు పూనుకుంది. కేసు పురోగతిని అమెరికా నిరంతరం పర్యవేక్షిస్తోంది.
యుఎస్ డిప్యూటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ క్యాంప్‌బెల్ జూన్‌లో మాట్లాడుతూ, భారతదేశం నుంచి తాము జవాబుదారీతనం కోరుకుంటున్నామని, ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ స్థాయిలో సమస్యలను లేవనెత్తామని అన్నారు. యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులైవన్ తన అజిత్ దోవల్‌తో కూడా దీనిని లేవనెత్తారు.
మాస్కో సందర్శన
ఈ నేపథ్యంలో మోదీ మాస్కో పర్యటన జరిగింది. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా ద్వైపాక్షిక అధికారిక పర్యటన ఇదే. కానీ ఇదే సమయంలో నాటో సదస్సు 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ లో శిఖరాగ్ర సమావేశం బైడెన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమయంలో ప్రపంచ మీడియా దృష్టి మొత్తం ఈ పర్యటనపైనే నిలిచింది. అమెరికా నాటో సమావేశానికి ప్రాధాన్యం లేకుండా పోయింది.
మోదీ, మాస్కో పర్యటన అనాలోచితంగా జరిగిందా లేదా భారతదేశ విదేశాంగ విధాన ప్రాధాన్యతలను అమెరికా నిర్దేశించలేదని చూపించడానికి ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసిందా అనేది స్పష్టంగా తెలియదు. కానీ ఊహించిన విధంగా, ఇది US.. ఉక్రెయిన్ నుంచి నిరసనల కేకలకు దారితీసింది.
ముళ్ల కౌగిలి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను మోదీ గట్టిగా కౌగిలించుకుని ఉన్న ఫోటోలు బయటకు రావడం.. ఇదే సమయంలో ఉక్రెయిన్ లోని పాఠశాలపై క్షిపణి దాడి జరిగి అనేక మంది పిల్లలు మరణించారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చాయి. అయితే క్షిపణి ఎవరూ ప్రయోగించారు అనే విషయంలో ఎవరికి సమాచారం దొరకలేదు. అంతా దీనిని రష్యానే ప్రయోగించిందని భావించారు. కానీ నిజం ఏంటో ఎవరికి తెలియదు.
భారతదేశంలోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ, ఒక సంఘర్షణ సమయంలో "వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి" కోసం న్యూఢిల్లీ చేసిన పనులు బాగా లేవని వ్యాఖ్యానించారు. వివాదం పెరుగుతున్న నేపథ్యంలో సులైవన్, దోవల్‌తో మాట్లాడారు.
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ" అని అన్నారు.
తరచుగా పునరావృతమయ్యే ప్రకటన
ఉక్రెయిన్ యుద్ధానికి ప్రాధాన్యత ఇవ్వడానికి భారతదేశం జాతీయ ప్రయోజనాలను త్యాగం చేస్తుందని ఆశించడం అవాస్తవమని భారత అధికారులు పదే పదే చెబుతున్నారు. కానీ అది కోర్స్ కరెక్షన్ చేసింది. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్‌తో చేసిన వ్యాఖ్యను మోదీ మరోసారి మాస్కోలో పునరావృతం చేశారు. యుద్ధం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది సమయం కాదని ఆయన సూచించారు.
ఇది మొదట ప్రకటించినప్పుడు పాశ్చాత్య మీడియాలో విస్తృత ప్రచారం పొందింది. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు రష్యా అధ్యక్షుడిపై మోదీ చేసిన విమర్శగా వ్యాఖ్యానించబడింది. అయితే రెండోసారి ఈ వ్యాఖ్య ఆశించినంత ప్రభావం చూపలేదు.
నష్ట నియంత్రణ
రష్యా పర్యటనలో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి తరువాత ఉక్రెయిన్ పర్యటన జరిగినట్లు అనిపించింది. "ఉక్రెయిన్ కంటే ఎక్కువగా, ఈ పర్యటన అమెరికాను శాంతింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, ఇది మోదీ, రష్యా పర్యటన వాషింగ్టన్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సమయంతో విపరీతమైన ప్రచారంలో ఉంది" అని భారత మాజీ రాయబారి ఒకరు చెప్పారు. మోదీ, పోలాండ్‌ను సందర్శించాల్సి ఉన్నందున, దానిని కీవ్ పర్యటనతో కలపడం సమంజసమని భారత అధికారులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది
అయితే, జంట పర్యటనలకు ముందు, ఈ ప్రాంతంలో భారతదేశానికి అత్యంత సన్నిహిత భాగస్వామి, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, విద్యార్థుల నిరసనతో అధికారం నుంచి తొలగించబడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. హసీనా ను భారత్ తక్షణమే రక్షించినప్పటికి సమీప భవిష్యత్ లో ఢాకాతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. తూర్పు యూరప్ లో మోదీ పర్యటన విషయంలో మోదీ తగ్గలేదు. తన పూర్తి దృష్టి ఈ ప్రాంతంపై నిలిపి పర్యటన విజయవంతం చేసుకున్నారు.
శాంతి సందేశం
పోలాండ్- ఉక్రెయిన్ రెండూ ఈ ప్రాంతంలో రష్యన్ వ్యతిరేక దేశాలు. అలాగే యుఎస్ సన్నిహిత మిత్రదేశాలు అనేది వాస్తవం. ప్రధాని మాస్కోను సందర్శించినందున, ఉక్రెయిన్‌కు వెళ్లకపోవడానికి ఎటువంటి కారణం లేదని మోదీ అనుకూల వర్గాలు వాదించాయి.
అంతేకాకుండా, భారతదేశం శాంతి గురించి, హింసను ముందస్తుగా నిలిపివేయడం, కొనసాగుతున్న సంఘర్షణకు పరిష్కారం గురించి మాట్లాడుతోంది. ఉక్రెయిన్‌కు వెళ్లడం ద్వారా, అతను దాని గురించి పుతిన్‌తో ఇప్పటికే మాట్లాడినందున సందేశాన్ని అక్కడికి చేరవేయగలడనేది వాస్తవం.
మోదీ, ఉక్రెయిన్ పర్యటన శాంతి మిషన్‌గా భావించబడింది. రష్యా అధ్యక్షుడి విశ్వాసాన్ని కూడా ఆయన ఆస్వాదించినందున సాధ్యమైన శాంతి కర్తగా భారత ప్రధాని పాత్ర ఉంది.
విఫలమైన మిషన్
కానీ అతను కీవ్‌ను సందర్శించడానికి ముందు, ఉక్రెయిన్ రష్యాపై దాడిని వేగవంతం చేసింది, రష్యా భూభాగంలోని అనేక లక్ష్యాలను చేధించింది. ఇది పుతిన్ స్థితిని కఠినతరం చేసింది. అతను ఇకపై శాంతికి అనుకూలంగా లేనని ప్రకటించాడు.
"దురదృష్టవశాత్తూ, జెలెన్స్కీ, మోదీ పర్యటనకు కొద్ది రోజుల ముందు కర్స్క్‌లో తన అత్యంత ప్రతీకాత్మక చొరబాటును ప్రారంభించడం ద్వారా, దాని ఉద్దేశ్యాన్ని దెబ్బతీశాడు" అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ అభిప్రాయపడ్డారు.
కీవ్‌లో సమావేశం ముగిసిన వెంటనే మోదీ వారి చర్చల సమయంలో చేసిన అన్ని ప్రతిపాదనలను జెలెన్స్‌కీ తిరస్కరించారు. దీనిని భారత్ లోని మేధావులు చిన్నపిల్లల చేష్టగా, ఫూలిష్ నెస్ గా అభివర్ణించారు. ఏదీ ఏమైనప్పటికీ మోదీ చేసిన శాంతి ప్రయత్నాలు మాత్రం విఫలం అయ్యాయని చెప్పవచ్చు. ఈ మిషన్ పూర్తిగా విఫలం అయింది.
Tags:    

Similar News